Gold, Silver Prices: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు!!!!!

0
196

Gold, Silver Prices: దేశీయ డిమాండ్ నుండి ప్రపంచ ఉద్రిక్తతలు, ఇతర అంశాల వరకు అనేక ప్రధాన కారణాలు వెలుగులోకి వచ్చాయి. వెండి ధరల పెరుగుదలకు పారిశ్రామిక డిమాండ్ ప్రధాన కారణమని నమ్ముతారు. సౌర ఫలకాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, గ్రీన్..

 

Gold, Silver Prices: ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పుచేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపు ధర పెరుగుతోంది. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం సామాన్యుడు గ్రాము బంగారం కొనాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. ఇప్పుడు పది గ్రాముల బంగారం కొనాలంటేనే లక్షా 35 వేల వరకు చెల్లించుకోవాల్సిందే.

 

అయితే ప్రతి రోజు ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు అప్‌డేట్‌ అవుతుంటాయి. ఈ సమయంలో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ప్రస్తుతం శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 660 రూపాయల వరకు తగ్గింది. దీంతో ఇప్పుడు తులం ధర రూ.1,34,180 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,000 వద్ద కొనసాగుతోంది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. అందుకే చాలా మంది బంగారం, వెండి కొనుగోలులో బిజీగా ఉన్నారు. చాలా మంది వ్యక్తిగత ఉపయోగం కోసం, వారి భవిష్యత్తు కోసం కూడా బంగారం, వెండిని కొనుగోలు చేస్తారు. మీరు కూడా ఇలాంటిదే ఆలోచిస్తుంటే, కొనుగోలు చేసే ముందు బంగారం, వెండి ధరలను ఖచ్చితంగా తనిఖీ చేయాలి.

ఇక వెండి ధరల్లో ఈ గణనీయమైన పెరుగుదల కొనసాగుతోంది. వెండి కూడా ఏ మాత్రం తగ్గకుండా పరుగులు పెడుతోంది. అయితే ప్రస్తుతం మాత్రం కిలో వెండిపై ఏకంగా రూ.2000 వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం కిలో వెండి ధర దేశీయంగా రూ.2,09,000 వద్ద ఉంది.

 

ఇక హైదరాబాద్‌, చెన్నై, కేరళ ప్రాంతాల్లో అయితే ధర భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.2,21,000 వద్ద కొనసాగుతోంది. దేశీయ డిమాండ్ నుండి ప్రపంచ ఉద్రిక్తతలు, ఇతర అంశాల వరకు అనేక ప్రధాన కారణాలు వెలుగులోకి వచ్చాయి. వెండి ధరల పెరుగుదలకు పారిశ్రామిక డిమాండ్ ప్రధాన కారణమని నమ్ముతారు. సౌర ఫలకాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలలో వెండికి బలమైన డిమాండ్ దాని నిరంతర పెరుగుదలకు దారితీసింది.

 

#Sivanagendra #Trending #Bharathaawaz #Newscoordinator 

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీ గారు అభినవ గాడ్సే
BREAKING    విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC ఛీఫ్    -...
By Rajini Kumari 2025-12-16 13:00:49 0 188
Telangana
నిజామాబాద్:హిందూసమేలనంలో పలుగొన్న ఎమ్మెల్యే
నగరంలో నీ బాస్వాగార్డెన్ లో నివాహిన్‌చిన హిందూసమేళనం కార్యక్రమంలో పలుగొన్న ఎమ్మెల్యే...
By Sadaq Sadaq 2026-04-21 14:51:00 0 101
Andhra Pradesh
గూడూరు మండలం పొన్నకల్ గ్రామం మతసామరస్యానికి ప్రతీక ఉరుసు మహోత్సవం 27న ప్రారంభం
ప్రజలు కోర్కెలు తీర్చే పొన్నకల్ కాజా మినల్లా హుసైని ఉరుసు మహోత్సవాలు 27 నుంచి 29 వరకు ఉత్సవాలు...
By mahaboob basha 2025-12-17 09:58:34 0 460
Andhra Pradesh
మదనపల్లె: హోటళ్లలో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధం.
మదనపల్లె పట్టణంలోని హోటళ్లలో మున్సిపల్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఇడ్లీ పాత్రలు,...
By Pagadala Venkateswar 2026-04-08 05:38:12 0 100
Telangana
తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్" కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని...
By Chunarkar Jagadeesh 2026-05-08 19:06:17 0 750
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com