లయ తప్పిన శృతిలయ.. ఈ లేడీ బీట్ ఆఫీసర్ పెద్ద మ్యాటరే నడిపింది..

0
177

ప్రభుత్వ ఉద్యోగిని… కానీ అక్రమ సంబంధం ఆమెను హత్య వరకు తీసుకెళ్లింది. అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన పాల్వంచలో సంచలనం సృష్టిస్తోంది. భార్య, ప్రియుడు సహా నలుగురి అరెస్టుతో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. .. ..

 

తను ప్రభుత్వ ఉద్యోగిని. కానీ దారి తప్పింది. తన అక్రమ సంబంధంకు అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే చంపి ఆపై కట్టుకథ అల్లింది. పాల్వంచ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు కాలనీకి చెందిన ధరవత్ హరినాథ్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఇది ఆత్మహత్య కాదు, పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఈ నేరానికి సంబంధించి మృతుడి భార్య, ప్రియుడుతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.​ ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున వెంగళరావు కాలనీకి చెందిన ధరావత్ హరినాథ్ (39) తన ఇంటి వెనుక స్లాబ్ హుక్కుకు వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించాడు. మృతుడి తల్లితో పాటు బంధువులు.. భార్య శృతిలయనే హరినాథ్‌ను చంపిందని.. పాల్వంచ బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. పోలీసులు విచారణ చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి తల్లి గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

పోలీసుల విచారణలో విస్తు పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి భార్య ధరావత్ శృతిలయ ములుగు జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌‌గా పనిచేస్తోంది. గతంలో ఆమె చర్ల ఏరియాలో పనిచేస్తున్న సమయంలో కొండా కౌశిక్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినప్పటికీ శృతిలయ ప్రవర్తనలో మార్పు రాలేదు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన శృతిలయ, తన ప్రియుడు కౌశిక్.. అతని స్నేహితులతో కలిసి భర్తను వదిలించుకోవాలని పన్నాగం పన్నింది. ఈ నెల 15వ తేదీ రాత్రి హరినాథ్ మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయంలో, నిందితులు అతని గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని ఇంటి వెనుక స్లాబ్ హుక్కు కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయడంతో ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితులు.. ​ధరవత్ శృతిలయ (36), ఆమె ప్రియుడు​ కొండా కౌశిక్ (31), వారికి సహకరించిన చెన్నం మోహన్ (32)​డేగల భాను (23)లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు.

#Sivanagendra #Trending #Telangana

Search
Categories
Read More
Andhra Pradesh
దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది - ఎమ్మెల్యే కొండయ్య
కూటమి ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాలను బాపట్ల...
By Vadlamudi NagaVenkat 2026-03-18 14:40:30 0 664
Legal
Supreme Court Restores Convictions in High-Profile Dr. Subbiah Murder Case
Overturning the Madras High Court’s controversial acquittals, the Supreme Court restored...
By Dunna Jessicaruth 2026-05-19 11:32:29 0 30
Andhra Pradesh
కేసును చాకచక్యంగా ఛేదించిన వెదుళ్ళపల్లి పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు
తక్కువ ధరకు బంగారం పేరిట పోలీసుల వేషంలో మోసం చేసిన ముఠా బాధితురాలి నుండి రూ.6,50,000/-...
By Gadiyapudi Narendra 2026-01-12 11:40:04 0 184
Andhra Pradesh
గుంటూరు విద్యార్థులలో మాదకద్రవ్యాల పై అవగాహన కల్పిస్తున్న గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు. గుంటూరు రేంజ్ ఐడి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి గారు మరియు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు సంకల్ప కార్యక్రమం నీర్వహించారు.
గుంటూరు జిల్లా పోలీస్...* *30.12.2025* _*// "సంకల్పం" కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మాదక...
By KOTESWARARAO KVSR 2025-12-30 15:23:07 0 582
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ భారతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ బాబుని అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న...
By Benguluri Madhubabu 2026-04-29 14:03:01 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com