గంగ అవెన్యూ వాసుల గోస.. రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి!

0
219

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గంగ అవెన్యూ మరియు దాని చుట్టుపక్కల కాలనీల నివాసితుల విజ్ఞప్తి మేరకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బుధవారం ప్రభుత్వ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. 

గంగ అవెన్యూ, ఎంఈఎస్ కాలనీ, కాశీపురం, శ్రీనివాసిక కాలనీల్లో నెలకొన్న నీటి నిల్వ మరియు డ్రైనేజీ సమస్యలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల (RWA) ప్రతినిధులు తమ బాధలను మైనంపల్లి దృష్టికి తీసుకెళ్లారు.

కాలనీల్లో సరైన వర్షపు నీటి కాలువలు (Storm Water Drains), బాక్స్ డ్రైన్లు లేకపోవడం వల్ల వర్షం పడితే లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా గంగ అవెన్యూలోని క్వారీ గుంతలు జలమయమవుతున్నాయని వివరించారు. పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పైప్‌లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని వారు కోరారు.

సమస్య తీవ్రతను గమనించిన మైనంపల్లి హనుమంతరావు అక్కడి నుండే ఎంఎంసీ కమిషనర్ విజయ కృష్ణారెడ్డి (IAS), మల్కాజిగిరి జడ్సీ సంచిత్ గంగ్వార్ (IAS)లతో ఫోన్లో మాట్లాడారు. 

పెండింగ్ పనులకు సంబంధించి తక్షణమే అనుమతులు మంజూరు చేసి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో వాటర్ బోర్డ్ జీఎం సునీల్, డిసి భోగేశ్వర్లు, జీహెచ్‌ఎంసీ ఈఈ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, డీఈ ప్రశాంత్, డీజీఎం సాంబయ్య తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

కాలనీ ప్రతినిధులు జోసెఫ్ రెడ్డి, రెహ్మాన్,  అంజనేయులు, మరియు కాంగ్రెస్ నేతలు సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, లడ్డు రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

#sidhumaroju

Alwal

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో ఇలాంటి అలంకరణ చాలా అరుదు కొత్తూరు మురళి
పుంగనూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ విరుపాక్షి మారమ్మ గంగజాతర సందర్భంగా మంగళవారం ప్రత్యేక...
By Kothuru Murali 2026-03-10 15:45:27 0 152
Bharat Aawaz
India's Gold Loan Crisis: Survival Debt Traps Middle Class
In India, gold is not a mere ornament; it represents generational savings, deep emotion, and...
By Hazu MD. 2026-06-06 09:51:05 0 213
Andhra Pradesh
South Coast Railway way Zone
దశాబ్దాల కలకు సాకారం.. నేటి నుంచి విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం.. రాష్ట్ర ప్రజల...
By G k Nookala 2026-06-01 04:34:43 0 156
Uttar Pradesh
UPPSC Releases PCS 2026 Recruitment Notification
The Uttar Pradesh Public Service Commission (UPPSC) has officially released the Combined...
By Navya Sree 2026-06-27 05:36:12 0 31
Andhra Pradesh
మైనర్లతో వీడియోలు.. రౌడీషీటర్పై కేసు
డోలపేట ఎస్సీ కాలనీకి చెందిన రౌడీషీటర్ అనిల్ కుమార్ ఎనిమిది మంది మైనర్లతోచట్టవిరుద్ధంగా వీడియోలు...
By Boiena Rajesh 2026-07-18 05:14:43 0 46
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com