గంగ అవెన్యూ వాసుల గోస.. రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి!

0
176

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గంగ అవెన్యూ మరియు దాని చుట్టుపక్కల కాలనీల నివాసితుల విజ్ఞప్తి మేరకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బుధవారం ప్రభుత్వ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. 

గంగ అవెన్యూ, ఎంఈఎస్ కాలనీ, కాశీపురం, శ్రీనివాసిక కాలనీల్లో నెలకొన్న నీటి నిల్వ మరియు డ్రైనేజీ సమస్యలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల (RWA) ప్రతినిధులు తమ బాధలను మైనంపల్లి దృష్టికి తీసుకెళ్లారు.

కాలనీల్లో సరైన వర్షపు నీటి కాలువలు (Storm Water Drains), బాక్స్ డ్రైన్లు లేకపోవడం వల్ల వర్షం పడితే లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా గంగ అవెన్యూలోని క్వారీ గుంతలు జలమయమవుతున్నాయని వివరించారు. పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పైప్‌లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని వారు కోరారు.

సమస్య తీవ్రతను గమనించిన మైనంపల్లి హనుమంతరావు అక్కడి నుండే ఎంఎంసీ కమిషనర్ విజయ కృష్ణారెడ్డి (IAS), మల్కాజిగిరి జడ్సీ సంచిత్ గంగ్వార్ (IAS)లతో ఫోన్లో మాట్లాడారు. 

పెండింగ్ పనులకు సంబంధించి తక్షణమే అనుమతులు మంజూరు చేసి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో వాటర్ బోర్డ్ జీఎం సునీల్, డిసి భోగేశ్వర్లు, జీహెచ్‌ఎంసీ ఈఈ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, డీఈ ప్రశాంత్, డీజీఎం సాంబయ్య తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

కాలనీ ప్రతినిధులు జోసెఫ్ రెడ్డి, రెహ్మాన్,  అంజనేయులు, మరియు కాంగ్రెస్ నేతలు సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, లడ్డు రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

#sidhumaroju

Alwal

Like
1
Search
Categories
Read More
Telangana
ముఖ్యనేత పదవికి ఎసరు పెట్టిన ‘నంబర్‌-2’‎సన్నిహితంగా ఉంటూనే పీఠంపై గురి
మూటల మోతలో వాటాల కొట్లాట! ‎ముఖ్యనేత పదవికి ఎసరు పెట్టిన ‘నంబర్‌-2’...
By Ponnala Srinivasrao 2026-04-03 01:06:24 0 193
Telangana
"ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షల వెల్లువ!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వివాహ...
By Sidhu Maroju 2026-04-23 09:22:43 0 116
Telangana
చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారిని దర్శించుకున్న మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్ట్ DCC ఉపాధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ గారు
మేడ్చల్ నియోజకవర్గం,కీసర 1వ డివిజన్,చీర్యాల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారి...
By Thalakayala Nagashiva 2026-04-13 10:13:52 0 167
Andhra Pradesh
గూడూరు ): అన్నదాత సుఖీభవ పియం కిసాన్తో రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని
అన్నదాత సుఖీభవ పియం కిసాన్తో రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని కోడుమూరు. ఎమ్మెల్యే బొగ్గుల...
By mahaboob basha 2025-08-02 14:15:18 0 778
Telangana
నార్త్ జోన్ టాస్క్ పోర్స్ డి.సి.పి. సుదీంద్ర ప్రెస్ మీట్.
సికింద్రాబాద్.. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపును కొంతమంది...
By Sidhu Maroju 2025-06-18 12:26:52 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com