నర్స్ వృత్తి అమ్మ చేసే సేవ లాంటిదే- ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
230

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఈశ్వరీ బాయి మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల ఫేర్ వెల్ & ఫ్రెషర్స్ డే వేడుకలు శుక్రవారం మారేడ్ పల్లి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో కళాశాల యాజమాన్యం వారు నిర్వహించారు . ఈ వేడుకలకు యాజమాన్యం ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

వేదికపై విద్యార్ధినీ, విద్యార్ధులకు మెరిట్ స్కాలర్ షిప్ లు, అకడమిక్ సర్టిఫికెట్ లను ఎమ్మెల్యే అందజేశారు.

 అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజానికి సేవ చేసే అదృష్టం నర్సు ల రూపంలో మీకు వచ్చిందని, హాస్పటల్స్ లో మీది తల్లి పాత్ర వంటిదని, మీ సేవల ద్వారా ప్రజలకు ఆత్మీయులుగా మారి, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, కళాశాల యాజమాన్యానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు.

పేద, మధ్యతరగతి విద్యార్ధినీ , విద్యార్ధులకు అందుబాటులో మంచి విద్యని అందిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ రామచంద్రా రెడ్డి, డాక్టర్ కృష్ణా రెడ్డి, శ్రీమతి మేఘనా రెడ్డి గార్లకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ షైనీ జాన్, స్కూల్ హెడ్ విజిత వాణి, కాంగ్రెస్ నాయకులు బద్రీనాథ్ యాదవ్, అరవింద్ యాదవ్ లు పాల్గొన్నారు.

Sidhumaroju    Farewell Pressures Day celebrations

Search
Categories
Read More
Andhra Pradesh
వికసిత్ భారత్ లక్ష్యంగా వి.బి.జి రామ్ చట్టం–2025 పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
బాపట్లజిల్లా : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన వి.బి.జి రామ్ చట్టం–2025 కు...
By Gadiyapudi Narendra 2026-03-02 13:39:09 0 273
Andhra Pradesh
అక్షర ఆంధ్ర గోడ పత్రికలు విడుదల చేసిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే...
By Pagadala Venkateswar 2026-02-24 07:22:01 0 153
Telangana
రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్
రాంనగర్–అల్లూరి సీతారామరాజు నగర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్ మంచిర్యాల:...
By Pinnehasan Odela 2026-06-26 13:41:38 0 82
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం పరిధిలో శాంతినగర్ వద్ద కారు ఢీకొని ఐదేళ్ల చిన్నారి పరిస్థితి విషమం
పుంగనూరు మండలం, శాంతినగర్ సమీపంలో శుక్రవారం ఉదయం 42వ జాతీయ రహదారిపై మదనపల్లి నుంచి పుంగనూరుకు...
By Kothuru Murali 2026-02-20 10:58:31 0 149
Telangana
మున్సిపాలిటీలు సమగ్రామాభివృద్దే ద్యేయం: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
     మెదక్ జిల్లా: మెదక్.  అన్ని వార్డులలో పౌర సౌకర్యాలు పెంపొందించి మోడల్...
By Sidhu Maroju 2025-08-22 17:22:06 0 596
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com