వికసిత్ భారత్ లక్ష్యంగా వి.బి.జి రామ్ చట్టం–2025 పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్

0
152
బాపట్లజిల్లా : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన వి.బి.జి రామ్ చట్టం–2025 కు సంబంధించిన అవగాహన పోస్టర్‌ను బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. వికసిత్ భారత్–2047 దార్శనికతకు అనుగుణంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ చట్టం యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలను సామాన్య ప్రజలకు వివరించేందుకు ఫిబ్రవరి 26, 2026 నుండి మార్చి 24, 2026 వరకు జిల్లావ్యాప్తంగా జన్ సంవాద్ పేరుతో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ప్రజలకు ఈ చట్టం ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధిని పటిష్టం చేస్తూ, పారదర్శకతతో కూడిన అభివృద్ధి పనుల ద్వారా గ్రామాల రూపురేఖలు మార్చడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా పాల్గొని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పిడి ఆళ్ల విజయలక్ష్మి జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు న్యాయవాదుల సంఘం బాధ్యతలు స్వీకరణ, న్యాయమూర్తుల నియామకంపై వినతి
అన్నమయ్య జిల్లా పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది విజయకుమార్, ప్రధాన...
By Kothuru Murali 2026-04-02 06:39:34 0 65
Andhra Pradesh
వెల్లంపల్లి ఇంట అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు
విజయవాడ 15-01-2025   ప్రచురణార్ధం   వెలంపల్లి ఇంట అంబరాన్ని అంటిన సంక్రాంతి...
By Rajini Kumari 2026-01-16 12:51:10 0 121
Andhra Pradesh
Population increase
జనాభా నిర్వహణపై దృష్టి సారించక పొతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని సీఎం చంద్రబాబుగారు...
By G k Nookala 2026-03-06 11:14:32 0 59
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com