వికసిత్ భారత్ లక్ష్యంగా వి.బి.జి రామ్ చట్టం–2025 పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
Posted 2026-03-02 13:39:09
0
152
బాపట్లజిల్లా : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన వి.బి.జి రామ్ చట్టం–2025 కు సంబంధించిన అవగాహన పోస్టర్ను బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. వికసిత్ భారత్–2047 దార్శనికతకు అనుగుణంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ చట్టం యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలను సామాన్య ప్రజలకు వివరించేందుకు ఫిబ్రవరి 26, 2026 నుండి మార్చి 24, 2026 వరకు జిల్లావ్యాప్తంగా జన్ సంవాద్ పేరుతో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ప్రజలకు ఈ చట్టం ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధిని పటిష్టం చేస్తూ, పారదర్శకతతో కూడిన అభివృద్ధి పనుల ద్వారా గ్రామాల రూపురేఖలు మార్చడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా పాల్గొని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పిడి ఆళ్ల విజయలక్ష్మి జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
#Narendra
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
పుంగనూరు న్యాయవాదుల సంఘం బాధ్యతలు స్వీకరణ, న్యాయమూర్తుల నియామకంపై వినతి
అన్నమయ్య జిల్లా పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది విజయకుమార్, ప్రధాన...
వెల్లంపల్లి ఇంట అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు
విజయవాడ
15-01-2025
ప్రచురణార్ధం
వెలంపల్లి ఇంట అంబరాన్ని అంటిన సంక్రాంతి...
Population increase
జనాభా నిర్వహణపై దృష్టి సారించక పొతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని సీఎం చంద్రబాబుగారు...