పాఠశాల స్థల విస్తీర్ణం సరిహద్దుల నిర్ధారణ - సంబంధిత అధికారుల సర్వే.|

0
200

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ లో గల కౌకూర్ ఉన్నత పాఠశాల స్థల విస్తీర్ణం సరిహద్దుల నిర్ధారణ కోసం మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి  ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు.

ఈ సర్వే కార్యక్రమంలో ఆర్మీ విభాగానికి చెందిన డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ వెంకన్న సిబ్బంది, మండల రెవెన్యూ కార్యాలయానికి చెందిన సర్వేయర్ అన్నపూర్ణ  మరియు ఇతర సిబ్బంది పాల్గొని పాఠశాల స్థల సరిహద్దులను పరిశీలించారు. సర్వే పూర్తి చేసిన అనంతరం పూర్తి వివరాలతో నివేదిక (రిపోర్ట్)ను త్వరలో అందజేస్తామని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల స్థలాలకు సంబంధించి ఎలాంటి సందిగ్ధత లేకుండా స్పష్టత తీసుకురావడం ద్వారా విద్యార్థులకు భద్రతతో కూడిన విద్యావాతావరణం కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ మురళీకృష్ణ, పాఠశాల సిబ్బంది, బిఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ యాదవ్, వెంకటేశ్ యాదవ్, స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju   

Search
Categories
Read More
Andhra Pradesh
2026 అంతర్జాతీయ యువత లేఖారచన పోటీ తేదీ మార్పు.
కడప డివిజన్ తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 2026 అంతర్జాతీయ యువత లేఖారచన పోటీ తేదీ మారినట్లు...
By Pagadala Venkateswar 2026-02-12 04:39:43 0 203
Telangana
ఇంకా ఎన్నాళ్లు ఇతరుల పెళ్లికి డాన్స్లు... రాజా సింగ్
ఆమ్మో ఆ రాష్ట్రంలో అధికారమా., అసలే రాదు చాలా కష్టం అనుకున్న రాష్ట్రంలో కూడా అధికారం భారీ...
By Ponnala Srinivasrao 2026-05-06 05:00:59 0 85
Andhra Pradesh
ACB Raids At Madanapalle DEO Office |మదనపల్లి డీఈఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో డీఈఓ కార్యాలయంలో స్కూల్ అప్గ్రేడేషన్ అనుమతుల కోసం లంచం తీసుకుంటుండగా...
By Pagadala Venkateswar 2026-01-22 06:44:00 0 186
Telangana
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు : దుంపల రంజిత్ కుమార్
* మంచిర్యాల జిల్లా * ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలి * ఆర్టీసీని...
By Avunoori Mahesh 2026-04-23 08:05:09 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com