పాఠశాల స్థల విస్తీర్ణం సరిహద్దుల నిర్ధారణ - సంబంధిత అధికారుల సర్వే.|

0
109

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ లో గల కౌకూర్ ఉన్నత పాఠశాల స్థల విస్తీర్ణం సరిహద్దుల నిర్ధారణ కోసం మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి  ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు.

ఈ సర్వే కార్యక్రమంలో ఆర్మీ విభాగానికి చెందిన డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ వెంకన్న సిబ్బంది, మండల రెవెన్యూ కార్యాలయానికి చెందిన సర్వేయర్ అన్నపూర్ణ  మరియు ఇతర సిబ్బంది పాల్గొని పాఠశాల స్థల సరిహద్దులను పరిశీలించారు. సర్వే పూర్తి చేసిన అనంతరం పూర్తి వివరాలతో నివేదిక (రిపోర్ట్)ను త్వరలో అందజేస్తామని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల స్థలాలకు సంబంధించి ఎలాంటి సందిగ్ధత లేకుండా స్పష్టత తీసుకురావడం ద్వారా విద్యార్థులకు భద్రతతో కూడిన విద్యావాతావరణం కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ మురళీకృష్ణ, పాఠశాల సిబ్బంది, బిఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ యాదవ్, వెంకటేశ్ యాదవ్, స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju   

Search
Categories
Read More
Andhra Pradesh
నిరుద్యోగులకు నగరపాలక సంస్థ స్పోర్ట్స్ కోచులుగా పనిచేయుటకు దరఖాస్తుల స్వీకరణ
విజయవాడ నగరపాలక సంస్థ  12-01-2026      *నిరుద్యోగులకు నగరపాలక సంస్థ...
By Rajini Kumari 2026-01-12 14:06:32 0 87
Andhra Pradesh
పుంగనూరు చిత్తూరు జిల్లా కి బాయ్ బాయ్ అన్నమయ్య జిల్లా కు వెల్కం
చిత్తూరు జిల్లాతో ఉన్న సంబంధాన్ని తెంచుకుని, పుంగనూరు బుధవారం కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో...
By Kothuru Murali 2026-01-01 12:25:40 0 79
Andhra Pradesh
ఏపీలో కొత్తగా మొబైల్ టవర్ల ఏర్పాటు
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది. మొబైల్ సిగ్నల్స్‌ను...
By John Baji 2025-12-29 09:22:05 0 72
Madhya Pradesh
Tridev the Elephant Rewilded in Madhya Pradesh
Madhya Pradesh has ended the practice of keeping elephants in captivity following a High Court...
By Pooja Patil 2025-09-15 06:02:37 0 150
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com