తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ప్రెస్ మీట్ .|

0
227

సికింద్రాబాద్ :తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) జనరల్ సెక్రెటరీ గురువారెడ్డి సికింద్రాబాద్ తాజ్ 3 స్టార్ హోటల్లో మీడియాతో మాట్లాడుతూ...

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నిర్వహిస్తూ, రాష్ట్ర మంత్రి  వివేక్ వెంకటస్వామి స్పాన్సర్ చేస్తున్న ఇంటర్–డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ అనేది బీసీసీఐ నియమావళి నం. 38 – సంఘర్షణ ప్రయోజనాలు (Conflict of Interest) కు పూర్తిగా విరుద్ధమైనది.

బీసీసీఐ నియమావళి ప్రకారం, క్రికెట్ పరిపాలన లేదా క్రికెట్ కార్యకలాపాల్లో మంత్రులు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ జోక్యం చేసుకోవడం నిషేధితం.

అంతేకాకుండా, హెచ్‌సీఏ ఏదైనా క్రికెట్ కార్యక్రమాలు లేదా క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే, ఇప్పటికే 11 జూలై 2021న బీసీసీఐ ఇచ్చిన ఆదేశాలు మరియు 21 మార్చి 2025న బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉన్నాయి. ఆ ఆదేశాలను పక్కనపెట్టి చేపట్టే ఏ చర్యైనా చట్టవిరుద్ధం మరియు రాజ్యాంగ విరుద్ధం.

ఇంకొక తీవ్రమైన వాణిజ్య సంఘర్షణ ఏమిటంటే, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ, హెచ్‌సీఏ నుంచి రూ. 67 కోట్ల బకాయిలు ఉన్నాయని ఆర్బిట్రేషన్ వివాదం ద్వారా క్లెయిమ్ చేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో, అదే మంత్రి కంపెనీ హెచ్‌సీఏ టోర్నమెంట్‌కు స్పాన్సర్ చేయడం ఎలా సమంజసం? వివాదంలో ఉన్న బకాయిలను పక్కనపెట్టి టోర్నమెంట్ నిర్వహించడం నైతికంగా మరియు చట్టపరంగా తప్పు.

ప్రస్తుతం హెచ్‌సీఏ బ్యాంక్ ఖాతాలు అన్నీ బ్లాక్‌లో ఉన్నాయి. అప్పుడు మంత్రి ఈ స్పాన్సర్ నిధులను ఏ ఖాతాలోకి, ఎవరికీ ఇవ్వబోతున్నారు?

హైకోర్టు మరియు బీసీసీఐ ఆదేశాలను పాటించని పరిస్థితిలో, హెచ్‌సీఏ నిజంగా అనుసరణకు సిద్ధమైతే, హైదరాబాద్ నగరం బయట ఉన్న జిల్లాల్లో జరిగే ఏ క్రికెట్ ఈవెంట్ అయినా తప్పనిసరిగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA)తో సంప్రదించి నిర్వహించాలి.

ప్రభుత్వ మంత్రి హోదాలో ఉండి, హెచ్‌సీఏ సభ్యుడిగా ఉండి, అదే హెచ్‌సీఏతో కలిసి తన తండ్రి పేరుతో టోర్నమెంట్ నిర్వహించడం బీసీసీఐ నియమావళికి ఘోరమైన ఉల్లంఘన.

వ్యక్తిగత హోదాలో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. కానీ, ఒకవైపు హెచ్‌సీఏ తనకు డబ్బులు బకాయి ఉన్నాయని ఆరోపణలు చేస్తూ, మరోవైపు అదే సంఘంతో సమావేశాలు నిర్వహించడం, టోర్నమెంట్‌కు సహకరించడం స్పష్టమైన ప్రయోజనాల సంఘర్షణ. (Conflict of Interest).

ఈ వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి  మరియు బీసీసీఐ సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలి అని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.

బీసీసీఐ ఇప్పటికే 2018లోనే అనుమతి నిరాకరించిన “జి. వెంకట స్వామి ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్”ను వెంటనే రద్దు చేయాలి. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం, మంత్రులు మరియు వారి కుటుంబ సభ్యులు నియమాలకు విరుద్ధంగా క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనడానికి అవకాశం లేదు.

ఈ అంశంపై మేము ఇప్పటికే బీసీసీఐకి, హెచ్‌సీఏ సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ నవీన్ రావుకి, అలాగే బీసీసీఐ ఒంబుడ్స్‌మన్ జస్టిస్ మిశ్రాకి మా ప్రతినిధులను సమర్పించి, ఈ టీ–20 లీగ్‌ను వెంటనే ఆపాలని కోరాము.

ఒకవేళ జిల్లాల్లో ఈ లీగ్ నిర్వహించాలంటే, హెచ్‌సీఏ మరియు టీసీఏ మధ్య సహకారంతోనే నిర్వహించాలని మేము కోరాము.

టీసీఏ భాగస్వామ్యం లేకుండా, హెచ్‌సీఏ జిల్లా క్రికెట్‌లో జోక్యం చేసుకోవడం పూర్తిగా మానుకోవాలన్నారు.

Sidhumaroju     

Search
Categories
Read More
Andhra Pradesh
Krishna Mohan Reddy: ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీం కోర్టులో నిరాశ.
రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ...
By Pagadala Venkateswar 2026-01-21 14:49:44 0 155
Andhra Pradesh
దర్శి ప్రజలకు త్వరలో క్రీడా ప్రాంగణం అంకితం
దర్శి ప్రజలకు త్వరలో క్రీడా ప్రాంగణం అంకితం రూ.2.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న క్రీడా వికాస...
By Chennaiah Kati 2026-07-22 15:43:51 0 28
Andhra Pradesh
Nara Lokesh: విశాఖలో 20 వేల ఉద్యోగాలు.. క్యాప్‌జెమినీకి మంత్రి లోకేశ్‌ కీలక ప్రతిపాదన.
ఏపీలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో...
By Pagadala Venkateswar 2026-03-12 05:50:51 0 201
Andhra Pradesh
PM సూర్య ఘర్ & పీఎం కుసుం కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర స్థాయి వీడియో...
By Pagadala Venkateswar 2026-02-21 04:32:47 0 163
Telangana
Police stop Armur mla Rakesh Reddy sent to Kamareddy mla office
ఆర్మూర్ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలింపు...
By G k Nookala 2026-06-29 06:32:36 0 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com