Nara Lokesh: విశాఖలో 20 వేల ఉద్యోగాలు.. క్యాప్‌జెమినీకి మంత్రి లోకేశ్‌ కీలక ప్రతిపాదన.

0
139

ఏపీలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా, ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ క్యాప్‌జెమినీని రాష్ట్రానికి ఆహ్వానించింది. విశాఖపట్నంలో క్యాప్‌జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమావేశమై కీలక చర్చలు జరిపారు. సుమారు 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంతో విశాఖలో ఒక భారీ ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేశ్ ప్రతిపాదించారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో విశాఖపట్నం ఐటీ, డేటా సెంటర్ హబ్‌గా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని లోకేశ్‌ వివరించారు. దేశంలోనే అతిపెద్దదైన గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని, ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. మరో మూడు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటంతో విశాఖకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని అన్నారు. ఇక్కడ ఉన్న ప్రత్యేక ఐటీ ఎకోసిస్టమ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

అంతేకాకుండా, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలతో కలిసి ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు కో-డెవలప్‌మెంట్ పార్టనర్‌గా వ్యవహరించాలని లోకేశ్ కోరారు. ఏపీలో 'క్వాంటం వ్యాలీ' అభివృద్ధికి, డెడికేటెడ్ క్వాంటం వర్టికల్ స్థాపనకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

 

మంత్రి లోకేశ్‌ ప్రతిపాదన.. క్యాప్‌జెమినీ సీఈవో సానుకూల స్పందన‌

మంత్రి లోకేశ్‌ ప్రతిపాదనలపై క్యాప్‌జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ సానుకూలంగా స్పందించారు. పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 3.4 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, వారిలో 2 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారని తెలిపారు. భారత్‌లోని 13 నగరాల్లో తమ కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయని వివరిస్తూ, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో క్యాప్‌జెమినీ ఇండియా సీఈవో సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురుగేశ్‌ కూడా పాల్గొన్నారు. క్యాప్‌జెమినీ సంస్థ వార్షికాదాయం సుమారు 23.9 బిలియన్ డాల‌ర్లు కావడం గమనార్హం.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్. మౌలానా అబ్దుల్ రషీద్ మజిలీ యాంటీమా విడ్కోలు
నిజామాబాద్ కు చెo దిన ప్రముఖధార్మిక పండితుడు.గాంధీ చౌక్ మస్జిద్-ఎ-కచియా ఇమం మౌలానా అబ్దుల్ రషీద్...
By Sadaq Sadaq 2026-02-26 23:44:29 0 188
Telangana
బిజెపి ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,
క్యాతనపల్లి మున్సిపాలిటీ అమ్మ గార్డెన్ స్టేజి దగ్గర గద్దెరాగడిలో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు...
By Avunoori Mahesh 2026-04-18 07:51:07 0 146
Telangana
"బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ" శాంతి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఘనమైన వేడుక
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ >    తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మను...
By Sidhu Maroju 2025-09-29 18:58:37 0 255
Andhra Pradesh
ఒక రోజు ముందే పెన్షన్లు నేడే పంపిణీ
ఎపీ ప్రభుత్వం ప్రతి నేల ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్లు ఒక రోజు ముందే ఇవ్వడం జరుగుతుంది.యన్.టి.ఆర్...
By Karapati Gopi 2025-12-31 01:03:41 0 479
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com