పల్స్ పోలియో ను విజయవంతం చేయండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ

0
160

*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌*

*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 19, 2025*

 

*ప‌క‌డ్బందీ ఏర్పాట్ల‌తో ప‌ల్స్ పోలియోను విజ‌య‌వంతం చేయండి*

- *కార్య‌క్ర‌మంలో వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి*

- *ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

 

ఈ నెల 21వ తేదీ ఆదివారం నిర్వ‌హించే ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని ప‌క‌డ్బందీ ఏర్పాట్ల‌తో వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో 100 శాతం విజ‌య‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. 

శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న జిల్లా టాస్క్‌ఫోర్స్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లాలో 966 పోలియో బూత్‌ల పరిధిలో దాదాపు 2,48,900 మంది సున్నా నుంచి అయిదేళ్ల‌లోపు పిల్లలు ల‌క్ష్యంగా ప‌ల్స్ పోలియో నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని.. వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, పంచాయ‌తీరాజ్‌, మునిసిప‌ల్, ప్ర‌జా ర‌వాణా, ఐసీడీఎస్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములు కావాల‌న్నారు. 611 గ్రామీణ బూత్‌లు, 355 అర్బ‌న్ బూత్‌లు, 71 మొబైల్ బృందాలు, 35 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా ప్ర‌త్యేక బృందాలు సేవ‌లందిస్తాయ‌న్నారు. ఈ నెల 21న బూత్ స్థాయిలోనూ.. ఈ నెల 22, 23వ తేదీల్లో ఇంటింటి స‌ర్వే ద్వారా చిన్నారుల‌కు పోలియో చుక్క‌లు వేయడం జ‌రుగుతుంద‌న్నారు. ఆశా కార్య‌క‌ర్త‌లు, ఏఎన్ఎంలు క్షేత్ర‌స్థాయిలో అంగ‌న్‌వాడీ కేంద్రాల సిబ్బందితో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఐదేళ్ల లోపు చిన్నారుల‌కు పోలియో చుక్క‌లు వేసేలా అధికారులు చూడాల‌న్నారు. ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మంపై ఇప్ప‌టి నుంచే వివిధ మార్గాల ద్వారా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని.. ముఖ్యంగా హైరిస్క్ ప్రాంతాల‌ను గుర్తించాల‌ని సూచించారు. బ‌స్ స్టేష‌న్లు, రైల్వే స్టేష‌న్లు త‌దిత‌ర చోట్ల కూడా పాయింట్లు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. సూప‌ర్వైజ‌రీ అధికారులు కార్య‌క్ర‌మం పూర్తిస్థాయిలో విజ‌య‌వంతమ‌య్యేలా చూడాల‌ని ఏ ఒక్క‌రూ మిగిలిపోకుండా ఇమ్యున‌జైషేన్ జ‌రిగేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. స‌మావేశంలో విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎం, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌, నందిగామ ఆర్‌డీవో కె.బాల‌కృష్ణ‌, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, డా. సునీల్‌, డా. జె.సుమ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీర్ జిల్లా వారి ద్వారా జారీ)

Search
Categories
Read More
Andhra Pradesh
శశాంక్ కనుమూరికి CM అభినందనలు
*Photo:* రాష్ట్రానికి చెందిన ఈక్వేస్టేరియన్ ఈవెటింగ్ క్రీడాకారుడు శశాంక్ కనుమూరి ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-25 07:36:58 0 136
Andhra Pradesh
మార్చి 9న 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహణ
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమాన్ని మార్చి 9న సోమవారం...
By Vadlamudi NagaVenkat 2026-03-06 14:51:55 0 539
Telangana
శ్రీరాంపూర్‌లో కుక్కల దాడి: నలుగురికి గాయాలు, ప్రజల్లో భయాందోళనలు
శ్రీరాంపూర్‌లో కుక్కల దాడి: నలుగురికి గాయాలు, ప్రజల్లో భయాందోళనలు  ...
By Pinnehasan Odela 2026-01-10 11:26:59 0 152
Andhra Pradesh
కూటమి ప్రభుత్వంలో ప్రాణాంతకంగా మారిన పాలు
రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని...
By Boiena Rajesh 2026-02-28 11:45:17 0 129
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com