NIRD బ్రిక్స్ తయారీ పైSHG మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభంMP కేశినేని శివనాద్ ఆధ్వర్యంలో

0
104

ప్ర‌చుర‌ణార్థం 18-12-2025

 

ఎన్.ఐ.ఆర్.డి లో బ్రిక్స్ త‌యారీ పై ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ప్రారంభం

ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో శిక్ష‌ణ పొందుతున్న‌ 4వ బ్యాచ్ 

 

విజ‌య‌వాడ : ఎంపీ కేశినేని శివ‌నాథ్ సార‌ధ్యంలో కేశినేని ఫౌండేష‌న్ మ‌రియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వ‌ర్యంలో బ్రిక్స్ త‌యారీ పై మూడు రోజుల శిక్ష‌ణ పొందేందుకు హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డికి వెళ్లిన 35 మంది ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ త‌ర‌గ‌తులు గురువారం ప్రారంభం అయ్యాయి. 4వ బ్యాచ్ గా వెళ్లిన వీరికి డిసెంబ‌ర్ 18 నుంచి 20 వ‌ర‌కు మూడు రోజుల పాటు బ్రిక్స్ త‌యారీ పై శిక్ష‌ణ వుంటుంది.

 

వీరంద‌రికి ముందుగా శిక్ష‌ణ త‌ర‌గ‌తుల గురించి అసోసియేట్ ఫ్రోపెస‌ర్ (సి.ఐ.ఎ.టి.ఎస్.జె -హెడ్) డాక్ట‌ర్ సి.క‌త్తిరేష‌న్, అసోసియేష‌న్ ప్రోఫెస‌ర్ డాక్ట‌ర్ ఎస్.ర‌మేష్ శక్తివేల్, సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ డాక్ట‌ర్ మ‌హ్మాద్ ఖాన్ వివ‌రించారు. అనంత‌రం బ్రిక్స్ త‌యారీ శిక్ష‌ణ‌లో భాగంగా గృహ నిర్మాణ రంగంలో ఆధునిక, పర్యావరణ హిత సాంకేతికాలపై అవగాహన పెంపొందించేందుకు సుస్థిర , అనుకూల గృహ నిర్మాణ సాంకేతిక‌త‌ను ప‌రిచ‌యం చేశారు.

 

 అలాగే CSEB (కంప్రెస్డ్ స్టెబిలైజ్డ్ ఎర్త్ బ్లాక్స్) తో పాటు ఇతర ఆధునిక గృహ నిర్మాణ పద్ధతులపై రూపొందించిన వీడియో డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అదేవిధంగా ఆర్.టి.పి లో ఏర్పాటు చేసిన సుస్థిర గృహ నిర్మాణ నమూనాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ నమూనాల ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యయ నియంత్రణ, శక్తి సమర్థత వంటి అంశాలపై శిక్ష‌ణ కు వ‌చ్చిన ఎస్.హెచ్.జి మ‌హిళ‌లు ప్రాక్టికల్ అవగాహన పొందారు. ఈమేర‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యం గురువారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రాష్ట్ర నూతన సిటిజెన్ సెంట్రిక్ జనవరి 20 నుండి ప్రారంభం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
జిల్లా లో ఈ విధానం ద్వారా ముఖ్యంగా పోక్సో కేసులు,మహిళలు చిన్నారులపై జరిగే నేరాలు వంటి సున్నితమైన...
By Gangaram Rangagowni 2026-02-06 07:29:23 0 60
Andhra Pradesh
వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి విశిష్టత
మనకి మొత్తం 26 ఏకాదశులు ఉంటాయి. (ఒక సంవత్సరంలో 24 + అధిక మాసంలో 2. వీటి అన్నిటిలో వైకుంఠ‌...
By John Baji 2025-12-30 01:55:32 0 90
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : గడ్డి మందు తాగిన యువకుడు మృతి
పుంగనూరు నియోజక వర్గం, చౌడేపల్లి మండలం, చిట్టిరెడ్డిపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న సతీష్ (25)...
By Kothuru Murali 2026-01-29 08:54:41 0 46
Andhra Pradesh
డాలర్ @90.93 పైస ఆల్ టైం రికార్డ్ పతనమైన రూపాయి
*డాలర్ @ రూ.90.83*   ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరిన రూపాయి విలువ   *రికార్డ్‌...
By Rajini Kumari 2025-12-16 11:38:37 0 120
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న డ్రోన్ ఎమ్మెల్యే కోట్ల !!
కర్నూలు : నంద్యాల : డోన్  మంత్రి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా డోన్ పట్టణంలో సేవా...
By Hari Krishna 2026-01-23 14:21:57 0 94
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com