ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా గుడివాడ వెనిగండ్ల రాము

0
125

*ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

 

*ఇంధన పొదుపు వారోత్సవాల... పోస్టర్లు, ప్రచార పత్రికలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే*

 

గుడివాడ డిసెంబర్ 15:ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఇంధన పొదుపు చర్యలు పాటిస్తూ భావితరాలకు భరోసా ఇవ్వాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. 

 

ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంధన పొదుపు వారోత్సవాల పోస్టర్, ప్రచార పత్రికలను రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో సోమవారం ఉదయం అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు వివరాలను అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు.

 

అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించేలా ఇంధన వనరులను బాధ్యతతో వినియోగించాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం ఇంధన పొదుపుపై ప్రజ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. చిన్న చిన్న జాగ్రత్తలతో విద్యుత్ ఆదా చేయడం వల్ల పర్యావరణ హితమై కాకుండా... డబ్బు కూడా ఆదా అవుతుందని ఎమ్మెల్యే రాము అన్నారు.

 

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ D.E జిబి శ్రీనివాసరావు, ఏడీలు బాపిరాజు, కిరణ్ బాబు, ఏఈలు బ్రహ్మానందరావు ఉష, సూర్యప్రకాశరావు, శ్రీహరి ఉద్యోగులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Technology
Samsung Begins Production of Its Slimmest Phone Yet — The Galaxy S25 Edge — in India
Samsung Begins Production of Its Slimmest Phone Yet — The Galaxy S25 Edge — in India...
By BMA ADMIN 2025-05-22 18:14:35 0 2K
Andhra Pradesh
విజయవాడ ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్
...పౌరా పౌరాహక్కుల సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ క్రాంతి చైతన్య అక్రమంగా నిర్భందాన్ని నిరసిస్తూ...
By Rajini Kumari 2026-01-20 11:15:11 0 60
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో మంగళవారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీనితో ప్రధాన...
By Kothuru Murali 2026-01-20 14:16:18 0 78
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com