'భూమా'సురులనుండి రక్షించండి- భాధితుల ఆవేదన.|

0
104

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వు ఉండగా కొందరు ఆక్రమణదారులు కబ్జా చేసి ప్రహరీ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని బాధితులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

శనివారం అల్వాల్ మండల పరిధి పాకాల కుంట సర్వే నంబర్ 571లో గల 20 ఎకరాల స్థలంలో 10 ఎకరాలు తమ తాతల నుండి తమకు వచ్చిందని, అది కోర్టు వివాదంలో ఉండగా లయోలా అకాడమీ వారు బోర్డు పెట్టి, పరారీ నిర్మాణం చేరుతున్నారని బాదితులు జ్ఞానేశ్వర్, వెంకటేశ్వర్ కుటుంబ సభ్యులు, లలితా కుటుంబ సభ్యులు, శ్రీమన్నారాయణ, ప్రతాప్ సహా మరికొందరు బాదితులు వెల్లడించారు.

డిసెంబర్ 2024లో తాము కోర్టును ఆశ్రయించగా కోర్టు ఉత్తరువు ప్రకారం స్టేటస్కో వచ్చిందని, దానిని లెక్క చేయకుండా ఆక్రమణదారులు కబ్జా చేసి పరారీ గోడ ఏర్పాటు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత అధికారులైన పోలీస్ స్టేషన్లో, మండల కార్యాలయంలో, జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని బాధితులు ఆరోపించారు. తమ దగ్గర దానికి సంబంధించిన ధ్రువపత్రాలు అన్నీ ఉన్నాయని, కబ్జాదారు ఇక్కడ బౌన్సర్లను ఏర్పాటు చేసి లోనికి రానీయకుండా అడ్డుపడుతున్నారని, స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులతో చర్యలు తీసుకొని తమ స్థలాన్ని రక్షించి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి జ్ఞానేశ్వర్ రుద్రమదేవి వారాల చిత్ర పాల్గొన్నారు.

 

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు
  రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు తప్ప,...
By John Baji 2026-01-01 01:56:47 0 71
Andhra Pradesh
వైసిపి ప్రభుత్వం నిలిపివేసిన బ్రాహ్మణ పథకాలన్నీ పునరుద్ధ రిస్తాం
*కృష్ణాజిల్లా, మచిలీపట్నం :*   గత వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసిన బ్రాహ్మణ సంక్షేమ...
By Rajini Kumari 2025-12-22 08:01:06 0 128
Andhra Pradesh
Sub registers get promotion to register.
ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్,...
By G k Nookala 2026-02-18 09:48:36 0 17
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com