'భూమా'సురులనుండి రక్షించండి- భాధితుల ఆవేదన.|

0
203

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వు ఉండగా కొందరు ఆక్రమణదారులు కబ్జా చేసి ప్రహరీ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని బాధితులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

శనివారం అల్వాల్ మండల పరిధి పాకాల కుంట సర్వే నంబర్ 571లో గల 20 ఎకరాల స్థలంలో 10 ఎకరాలు తమ తాతల నుండి తమకు వచ్చిందని, అది కోర్టు వివాదంలో ఉండగా లయోలా అకాడమీ వారు బోర్డు పెట్టి, పరారీ నిర్మాణం చేరుతున్నారని బాదితులు జ్ఞానేశ్వర్, వెంకటేశ్వర్ కుటుంబ సభ్యులు, లలితా కుటుంబ సభ్యులు, శ్రీమన్నారాయణ, ప్రతాప్ సహా మరికొందరు బాదితులు వెల్లడించారు.

డిసెంబర్ 2024లో తాము కోర్టును ఆశ్రయించగా కోర్టు ఉత్తరువు ప్రకారం స్టేటస్కో వచ్చిందని, దానిని లెక్క చేయకుండా ఆక్రమణదారులు కబ్జా చేసి పరారీ గోడ ఏర్పాటు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత అధికారులైన పోలీస్ స్టేషన్లో, మండల కార్యాలయంలో, జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని బాధితులు ఆరోపించారు. తమ దగ్గర దానికి సంబంధించిన ధ్రువపత్రాలు అన్నీ ఉన్నాయని, కబ్జాదారు ఇక్కడ బౌన్సర్లను ఏర్పాటు చేసి లోనికి రానీయకుండా అడ్డుపడుతున్నారని, స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులతో చర్యలు తీసుకొని తమ స్థలాన్ని రక్షించి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి జ్ఞానేశ్వర్ రుద్రమదేవి వారాల చిత్ర పాల్గొన్నారు.

 

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
రామసముద్రం: కొత్తిమీర మూట జారిపడి మహిళ చెవి తెగిన వైనం.
బుధవారం రామసముద్రం మండలంలో కొత్తిమీర మూటలను లోడ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన...
By Pagadala Venkateswar 2026-05-28 06:50:11 0 77
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం
సదుం గ్రామానికి చెందిన ఆసిఫ్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం పుంగనూరు ఆర్డీవో కార్యాలయానికి ద్విచక్ర...
By Kothuru Murali 2026-03-13 08:54:32 0 157
Andhra Pradesh
మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య.
మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్...
By Pagadala Venkateswar 2026-01-19 07:11:03 0 196
Uttar Pradesh
Nautapa, Storms Claim Over 15 Lives; Fresh Severe Heat Alert Issued for Purvanchal
Severe weather has devastated regions, with the intense Nautapa heatwave and subsequent strong...
By Tejaswini Komanduru 2026-06-05 07:46:58 0 619
Telangana
"తాపి మేస్త్రీల ఆత్మగౌరవ సభకు బీజేపీ నేత భరత్ సింహారెడ్డి మద్దతు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  చింతల్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద నిర్వహించిన తాపి...
By Sidhu Maroju 2026-05-31 10:53:35 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com