'భూమా'సురులనుండి రక్షించండి- భాధితుల ఆవేదన.|

0
204

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వు ఉండగా కొందరు ఆక్రమణదారులు కబ్జా చేసి ప్రహరీ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని బాధితులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

శనివారం అల్వాల్ మండల పరిధి పాకాల కుంట సర్వే నంబర్ 571లో గల 20 ఎకరాల స్థలంలో 10 ఎకరాలు తమ తాతల నుండి తమకు వచ్చిందని, అది కోర్టు వివాదంలో ఉండగా లయోలా అకాడమీ వారు బోర్డు పెట్టి, పరారీ నిర్మాణం చేరుతున్నారని బాదితులు జ్ఞానేశ్వర్, వెంకటేశ్వర్ కుటుంబ సభ్యులు, లలితా కుటుంబ సభ్యులు, శ్రీమన్నారాయణ, ప్రతాప్ సహా మరికొందరు బాదితులు వెల్లడించారు.

డిసెంబర్ 2024లో తాము కోర్టును ఆశ్రయించగా కోర్టు ఉత్తరువు ప్రకారం స్టేటస్కో వచ్చిందని, దానిని లెక్క చేయకుండా ఆక్రమణదారులు కబ్జా చేసి పరారీ గోడ ఏర్పాటు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత అధికారులైన పోలీస్ స్టేషన్లో, మండల కార్యాలయంలో, జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని బాధితులు ఆరోపించారు. తమ దగ్గర దానికి సంబంధించిన ధ్రువపత్రాలు అన్నీ ఉన్నాయని, కబ్జాదారు ఇక్కడ బౌన్సర్లను ఏర్పాటు చేసి లోనికి రానీయకుండా అడ్డుపడుతున్నారని, స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులతో చర్యలు తీసుకొని తమ స్థలాన్ని రక్షించి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి జ్ఞానేశ్వర్ రుద్రమదేవి వారాల చిత్ర పాల్గొన్నారు.

 

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
RTI చిలుకూరు మండల అధ్యక్షుడిగా నూకపంగు వినోద్ ఎన్నిక
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో గురువారం సమాచార హక్కు రక్షణ చట్టం 2005 చిలుకూరు మండల...
By Nookapangu Manikanta 2026-04-23 11:49:06 0 163
Telangana
టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులను అక్రిడిటేషన్ సమావేశాలకు ఆహ్వానించాలి
రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల సమావేశాలకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్...
By Pinnehasan Odela 2026-05-06 08:49:46 0 230
Business & Finance
Wind Up an LLP with a Simple Legal Exit Process
Winding up an LLP (Limited Liability Partnership) is the legal process of closing the business...
By Navya Sree 2026-07-10 05:35:48 0 59
SURAKSHA
P. S. Pradyumna IAS: Transforming Governance with Vision
A dynamic Andhra Pradesh cadre IAS officer recognized for administrative excellence, urban...
By Lokeshwari Panthadi 2026-07-16 06:17:36 0 63
Andhra Pradesh
మదనపల్లిలో విషసర్పం కాటు.. ఆసుపత్రికి తరలింపు.
మదనపల్లి పట్టణానికి చెందిన ఆర్. రెడ్డప్ప (40) మంగళవారం బొమ్మచెరువు సమీపంలోని దానిమ్మ తోటలో కూలి...
By Pagadala Venkateswar 2026-02-04 07:20:53 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com