పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.|

0
118

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి, అల్వాల్ డివిజన్ పరిధిలోని ముత్యం రెడ్డి నగర్ ఫేజ్–1 & 2లో రూ. 7.7 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన ల్యాండ్‌స్కేప్ పార్కులు, బోర్‌వెల్స్, సిట్టింగ్ బెంచీలు, పాత్‌ వే తదితర పార్కు సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

అలాగే భారతి నగర్‌లో రూ. 18 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ నిర్మాణ పనులను కూడా ఆయన స్థానిక నాయకులు, ప్రజల సమక్షంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ —

అల్వాల్ డివిజన్ అభివృద్ధి పట్ల తన కట్టుబాటు ఎల్లప్పుడూ కొనసాగుతుందని, ప్రతి కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజలు సూచించిన ప్రతి అభివృద్ధి అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుని అధికారులతో సమన్వయం చేస్తూ త్వరితగతిన పూర్తి చేయించే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కాలనీవాసులు, బిఆర్ఎస్ నాయకులు  పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మాజీ సీఎంను కలిసిన యువ నాయకులు
గురువారం విజయవాడలోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని...
By Kothuru Murali 2026-04-03 09:41:04 0 54
Andhra Pradesh
సకాలములో చెల్లించండి వడ్డీ భారాన్ని తగ్గించుకోండి
మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు మార్చి 1వ తేదినుండీ 31 తేదీ వరకు ప్రచార కర పత్రాలతో ఆటో వాహనం...
By Mobbu Venkatramana 2026-03-18 14:26:59 0 154
Andhra Pradesh
అంబటి రాంబాబు పై కేసు నమోదు.
AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని...
By Pagadala Venkateswar 2026-01-31 12:04:06 0 94
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న సదుం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న సత్యనారాయణకు...
By Kothuru Murali 2026-01-27 05:00:11 0 119
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com