పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.|

0
144

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి, అల్వాల్ డివిజన్ పరిధిలోని ముత్యం రెడ్డి నగర్ ఫేజ్–1 & 2లో రూ. 7.7 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన ల్యాండ్‌స్కేప్ పార్కులు, బోర్‌వెల్స్, సిట్టింగ్ బెంచీలు, పాత్‌ వే తదితర పార్కు సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

అలాగే భారతి నగర్‌లో రూ. 18 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ నిర్మాణ పనులను కూడా ఆయన స్థానిక నాయకులు, ప్రజల సమక్షంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ —

అల్వాల్ డివిజన్ అభివృద్ధి పట్ల తన కట్టుబాటు ఎల్లప్పుడూ కొనసాగుతుందని, ప్రతి కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజలు సూచించిన ప్రతి అభివృద్ధి అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుని అధికారులతో సమన్వయం చేస్తూ త్వరితగతిన పూర్తి చేయించే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కాలనీవాసులు, బిఆర్ఎస్ నాయకులు  పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
ఇందిరా పార్క్ ధర్నాను జయప్రదం చేయండి: అఖిలపక్ష నాయకుల పిలుపు.
ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా తేదీ 17జూన్ నాడు నిర్వహించే ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాను...
By Sidhu Maroju 2025-06-15 11:28:15 0 1K
Telangana
కేయూసీ పరిధిలో హత్యయత్నం....... ఒకరికి గాయాలు
హన్మకొండ: (భరత్ ఆవాజ్ ప్రతినిధి)  కే యూ సీ పోలీస్ పరిధిలోని గోపాలపూర్ కల్లూమండువా వద్ద...
By Prashanth Goindla 2026-04-05 13:50:31 0 242
Telangana
నేలకొండపల్లిలో ప్రమాదం.. ఆరుగురు యువకులకు గాయాలు...
శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారును తప్పించబోయి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా...
By Krishna Balina 2026-03-06 09:58:52 0 226
Sports
2nd Test Day 1
Indian skipper Shubman Gill stars for Team India as he scored his 7th Test century in spectacular...
By Bharat Aawaz 2025-07-02 17:53:09 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com