హిందూ స్మశాన వాటికను మోడల్ స్మశాన వాటికగా మారుస్తా: ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
33

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: బోయిన్ పల్లి చిన్న తోకట్ట లోని శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని GM అంజయ్య శ్మశాన వాటిక సంక్షేమ సంఘం సభ్యులు ఆదివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో కలిసి వినతిపత్రం అందజేశారు.

 తనను కలిసిన స్మశాన వాటిక సంక్షేమ సంఘం సభ్యులతో స్మశాన వాటిక అభివృద్ధి గురించి చర్చించి ఈ స్మశాన వాటికను నియోజకవర్గం లోనే మోడల్ స్మశాన వాటికగా అభివృద్ధి చేద్దామని, దానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.

 మొదటి విడతగా ఎమ్మెల్యే నిధుల నుంచి 50 లక్షల రూపాయలను కేటాయిస్తున్నానని, ఈ నిధుల ద్వారా స్మశానవాటికలో దహన వాటికలు, పురుషులు, స్త్రీలు దుస్తులు మార్చుకొనే గదులు, మంచినీటి సదుపాయం తదితర ఏర్పాట్లను చేసుకుందామని, ఈ నిధులు సరిపోకపోతే మరిన్ని నిధులు కేటాయిస్తానని, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న నాకు మీరందరూ సహకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులైనా తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు.

ఎమ్మెల్యేను కలిసిన వారిలో స్మశాన వాటిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కొండల్ యాదవ్, ఉపాధ్యక్షులు సదానంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మారుతి గౌడ్, అశోక్, యాదవరావు, రామారావు తదితరులు ఉన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పెద్దలు పూజ్యులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి
గూడూరు నగర పంచాయతీ నందు పెద్దలు పూజ్యులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా స్థానిక...
By mahaboob basha 2025-09-25 10:24:36 0 170
Telangana
నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన నిందితుడు రియాజ్ పోలీసులకు దొరికిండు.
హైదరాబాద్:  నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారైన రియాజ్ పోలీసులకు...
By Sidhu Maroju 2025-10-19 12:55:17 0 132
Telangana
అల్వాల్ ల్లో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న హైడ్రా
అల్వాల్ చిన రాయుని చెరువులో అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా...
By Sidhu Maroju 2025-06-05 05:10:27 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com