YS Viveka: వైఎస్ వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం.

0
149

ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా అని సీబీఐని ప్రశ్నించిన ధర్మాసనం

ఎవరిని విచారించాలనుకుంటున్నారో చెప్పాలని ఆదేశం

తదుపరి విచారణ ఫిబ్రవరి 5కి వాయిదా

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా? అనే అంశంపై సీబీఐని సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రశ్నించింది. ఎవరిని కస్టడీలోకి తీసుకుని విచారించాలనుకుంటున్నారో, ఏయే అంశాలపై మరింత విచారణ అవసరమో వివరంగా తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది.

 

 

 

వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ట్రయల్ కోర్టును ఆశ్రయించినప్పటికీ, తమ పిటిషన్‌లో ప్రస్తావించిన కీలక అంశాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని ఆయన తెలిపారు. పిటిషన్‌లో లేని అంశాల ఆధారంగా పరిమిత స్థాయిలో మాత్రమే పాక్షిక దర్యాప్తుకు అనుమతిచ్చారని, ఇది న్యాయసమ్మతం కాదని పేర్కొన్నారు.

 

 

ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, కేసులో ఇంకా దర్యాప్తు అవసరమా అనే విషయంపై సీబీఐ స్పష్టత ఇవ్వాలని కోరింది. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ, దర్యాప్తు అధికారితో చర్చించి పూర్తి వివరాలు సమర్పించేందుకు రెండు వారాల గడువు కావాలని తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
Jagan Mohan Reddy: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన జగన్.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలోకి వచ్చిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి...
By Pagadala Venkateswar 2026-02-11 06:09:36 0 115
Andhra Pradesh
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాయచోటిలో ఘన నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి భాష సంయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమర నిరాహార దీక్ష...
By Benguluri Madhubabu 2026-03-16 05:52:50 0 160
Andhra Pradesh
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భద్రతా మరియు బందోబస్తు నిర్వహణపై గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో కలసి హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.
🚩 నేటి నుంచి (11.02.2026) ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, సమావేశాలు సజావుగా...
By John Baji 2026-02-11 05:54:56 0 293
Andhra Pradesh
Vidyasagar: ఏపీ జేఏసీ చైర్మన్‌గా విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నిక.
అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలన్న విద్యాసాగర్ 33 ఏళ్ల...
By Pagadala Venkateswar 2026-02-11 11:49:26 0 108
Andhra Pradesh
యువతకు భరోసా టీడీపీ పాలనలోనే సాధ్యం ఐటిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించిన పదివేల 600 ఉద్యోగాలతో కూడిన మెగా జాబ్...
By Benguluri Madhubabu 2026-03-20 11:13:09 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com