జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంతో కంటోన్మెంట్ నాయకుల సంబరాలు.!

0
195

సికింద్రాబాద్:  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  ఆధ్వర్యంలో ఎర్రగడ్డ డివిజన్ లో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈరోజు పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే శ్రీగణేష్ ని ప్రత్యేకంగా అభినందించి, ఆనందోత్సాహాల మధ్య బాణాసంచా కాల్పులతో హోరెత్తించి, మిఠాయిలు పంచుకున్నారు. సంబరాల అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు నాయకులు , కార్యకర్తల సహకారంతో అహోరాత్రులు శ్రమించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొని జూబ్లీహిల్స్ లో విజయం సాధించామని అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

ఈ సంబరాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జంపన ప్రతాప్, ముప్పిడి మధుకర్, బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్, అరవింద్ యాదవ్, గౌరీ శంకర్,బల్వంత్ రెడ్డి, నరేష్, మహేష్,సరిత, భవాని, ధనలక్ష్మి,ధనశ్రీ, గోమతి, తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju    

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: వన్ టౌన్ ఎస్ఐగా రహీముల్లా బాధ్యతల స్వీకారం.
మదనపల్లి ఒకటో పట్టణ (వన్ టౌన్) పోలీస్ స్టేషన్ ఎస్ఐగా రహీముల్లా సోమవారం బాధ్యతలు స్వీకరించారు....
By Pagadala Venkateswar 2026-03-03 05:31:40 0 116
Andhra Pradesh
PGRS వ్యవస్థను ప్రజలందరూ సద్వినియోగ పరుచుకోవాలి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*'పి.జి.ఆర్.ఎస్' వ్యవస్థను ప్రజలందరూ సద్వినియోగించుకోవాలి:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
By Rajini Kumari 2025-12-27 10:58:44 0 182
Andhra Pradesh
Govt school increased girls strength
ప్రభుత్వం ప్రత్యేకంగా బాలికల కోసం ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేయడం, వారి కోసం ప్రత్యేకంగా సంక్షేమ...
By G k Nookala 2026-04-06 15:55:08 0 139
Telangana
భార్యను హత్య చేసిన భర్త... ?
మహబూబాబాద్ ,కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్ ఆవాజ్): వివాహిత దారుణంగా హత్యకు గురైన సంఘటన, మహబూబాబాద్...
By Bittu Bittu 2025-12-14 13:20:04 0 300
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com