భాగ్యనగరంలో ఆఫ్రికన్ నత్తలు – భయాందోళనలో ప్రజలు.|

0
229

సికింద్రాబాద్ : భాగ్యనగరంలో నత్తలు  బెంబేలెత్తిస్తునాయి. ఆఫ్రికన్ నత్తల దాడికి ఎంతటి మహా వృక్షాలైన నేలకు ఒరగాల్సిందే.. శరవేగంగా విస్తరిస్తున్న ఈ నత్తల మూలంగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లిలో మిలిటరీకి చెందిన మూడు ఎకరాల విస్తీర్ణంలోని పచ్చని వనంలో ఆఫ్రికన్ నత్తలు కనిపించడం ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇవి ఆకులు చిగుళ్ళు కాండం పూత పిందెలను కాకుండా ఏకంగా వృక్షాలే నేలకురిగేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ అంతట విస్తరిస్తే ఉన్న కొద్దిపాటి పార్కులు ఇండ్లలో పెంచుకునే ముక్కలు మిగలరని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కేరళలో ఎక్కువగా కనిపించే ఈ నత్తలు బోయిన్పల్లిలో కనబడడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీటి జీవితకాలం అయిదారేళ్ళు కాగా ఒక్కోటి నెలకు వందల సంఖ్యలో గుడ్లను పెట్టి విపరీతంగా సంతాన ఉత్పత్తి అభివృద్ధి చేస్తాయి. గతంలో ఆంధ్రప్రదేశ్లోని ఉపయోగపడే శ్రీకాకుళం జిల్లాలో రైతులను మిత్రులు లేకుండా చేసి బొప్పాయి ఆయిల్ ఫామ్ మిరప తదితర పంటలను పూర్తిగా నాశనం చేయడంతో అప్పట్లో నిపుణుల సూచనల మేరకు ఉప్పు ద్రావణం కాపర్ సల్ఫేట్, స్నెయిల్ కిల్లర్ మందు వాడే పిచికారి చేసి అదుపులోకి తెచ్చారు. వాతావరణం లోని తేమ ఎక్కువగా ఉండే చోట అభివృద్ధి చెందుతాయని ఆఫ్రికా నుంచి ఓడల ద్వారా వచ్చి ఉంటాయని నిపుణులు అంటున్నారు.పురుగుల మందుల ద్వారా నివారించవచ్చు అని పర్యావరణానికి ఇవి అత్యంత ప్రమాదకరమని అన్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉంటే వాటితో తగ్గిపోతాయని అన్నారు.

కంటోన్మెంట్ యంత్రాంగం వెంటనే స్పందించి చీడ నివారణకు రసాయనాలు ఉప్పు ద్రావణాలతో పిచికారి చేయించారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రహరీ గోడతో పాటు చెట్లకు పుట్టలపై పిచికారి చేయించి వాటిని సంహరించారు.

Sidhumaroju   

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, ఎర్రాతివారి పల్లిలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి...
By Kothuru Murali 2026-01-22 13:26:01 0 148
Telangana
ఇంధన నిల్వల పై భయం వద్దు
పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ...
By Dodla Nagaraju 2026-03-25 07:43:06 0 304
Andhra Pradesh
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన గుంటూరు కలెక్టర్ మరియు ఎస్పీ
 *ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్.పి* గుంటూరు, డిసెంబరు 24 :...
By KOTESWARARAO KVSR 2025-12-24 12:21:15 0 218
Andhra Pradesh
అరుణాచలేశ్వరుని ఆశీస్సులు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలోని శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి...
By Benguluri Madhubabu 2026-04-18 14:12:04 0 156
West Bengal
CM Suvendu Adhikari Begins Maiden North Bengal Tour
In his first official visit to North Bengal since taking oath as Chief Minister on May 9, Suvendu...
By Dunna Jessicaruth 2026-05-20 10:31:41 0 49
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com