ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనుల వల్ల ట్రాపిక్ ఇబ్బందులు కలగకుండా చూడండి : ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
143

సికింద్రాబాద్: ప్యారడైజ్ నుంచి బోయిన్ పల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను ప్రారంభించడంతో ఈరోజు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ట్రాఫిక్ ఆంక్షలను విధించి వాహనాలను దారి మళ్ళిస్తున్నారు . కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ట్రాఫిక్ అడిషనల్ డిసిపి వేణుగోపాల్ రెడ్డి, హెచ్ ఎం డి ఏ డిప్యూటీ ఇంజనీర్ విద్యాసాగర్ మరియు ఇతర అధికారులతో మాట్లాడి వాహనదారులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని చేపట్టిందని దీనివలన ట్రాఫిక్ ఇబ్బందులకు ప్రజలు గురి కావద్దని కావున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా బాలంరాయి చౌరస్తా,అన్న నగర్ చౌరస్తా లలో తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతుందని, దీని వల్ల స్థానిక బస్తీల వాసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.అలాగే వాహనదారులతో కూడా స్వయంగా మాట్లాడి వారి సూచనలను పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ఇఫ్తార్ విందు ప్రాంగణంలో సామరస్యానికి ప్రతీకగా నాయకుల కలయిక
రాయచోటి రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ప్రత్యేక...
By Benguluri Madhubabu 2026-03-16 05:32:27 0 139
Andhra Pradesh
హాస్పిటల్ కి ఐఎస్ఓ సర్టిఫికెట్ : కర్నూలు
కర్నూలు : కర్నూలులోని మెడికెవరు హాస్పిటల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఐఎస్ఓ సర్టిఫికెట్...
By Hari Krishna 2025-12-25 07:59:38 0 157
Telangana
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటిన డిప్యూటీ సీ.ఎం. బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీ గణేష్
మల్కాజ్ గిరి/ బోయిన్ పల్లి   బోయిన్ పల్లి లోని NIEPID (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది...
By Sidhu Maroju 2025-07-29 12:32:16 0 815
Andhra Pradesh
పుంగనూరు: ఆనందోత్సాహలాలు మునిగిపోయిన ప్రజలు
టీ-20 ప్రపంచ కప్ విజేతగా భారత్ అవతరించడంతో పుంగనూరు నియోజకవర్గంలోని మండలాల్లోని ప్రజలు, క్రికెట్...
By Kothuru Murali 2026-03-09 08:11:28 0 90
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com