విద్యార్థుల ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలి జిల్లా మలేరియా అధికారి నూకరాజు

0
192

గూడూరు పట్టణంలోని కేజీబీవీ స్కూల్లో విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా మలేరియా అధికారి కే జి బి వి స్కూల్ ప్రిన్సిపాల్ జరినాకు సూచించారు శనివారం జిల్లా మలేరియా అధికారి కేజీబీవీ స్కూల్ ను సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా కేజీబీవీ స్కూల్ లోని వంట గదులను వంట పరికరాలను అలాగే విద్యార్థులకు అందించే ఆహారాలను అలాగే విద్యార్థుల తరగతులను పరిసర ప్రాంతాలను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విష జ్వరాల అలాగే డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నెలకు ఒకసారి స్థానిక వైద్యాధికా రూలతో వైద్య పరీక్షలు చేయించాలని అని అన్నారు అలాగే విద్యార్థులు త్రాగే నీరు కలుషం లేకుండా వడపోసి తాగేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య విషయాలను తెలుసుకొని అవసరమైన మందులను అందించాలని వారికి సూచించారు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించి సురక్షితమైన నీరును అందించాలని కేజీబీవీ స్కూల్ సిబ్బందిని ఆదేశించారు ఈయన వెంట స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రత్యూష ఉన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: నా బిడ్డకు ప్రాణపరిచి పెట్టండి.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పోతబోలు గ్రామానికి చెందిన నిశాంత్ కుమార్ అనే బాలుడు లివర్...
By Pagadala Venkateswar 2026-02-06 04:43:05 0 41
Jammu & Kashmir
"Book Raids in Kashmir Spark Free Speech Debate"
Srinagar, Jammu&Kashmir- Authorities in Srinagar conducted raids on several bookstores,...
By BMA ADMIN 2025-08-11 10:09:18 0 1K
Andhra Pradesh
బాలల సంరక్షణ కేంద్రాల్లో జిల్లా స్థాయి కమిటీ తనిఖీలు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 16, 2025*...
By Rajini Kumari 2025-12-16 12:26:04 0 118
Andhra Pradesh
నాందేడ్ చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
నాందేడ్ చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు • ప్రభుత్వ అతిథి హోదాలో...
By Chennaiah Kati 2026-01-25 07:18:49 0 78
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com