ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం|

0
238

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలకు సమాజంలో భద్రత కల్పించేది పోలీసులే. పోలీసులు లేని సమాజాన్ని అసలు ఊహించలేం. ఏ వ్యవస్థ అయినా సాఫీగా సాగాలంటే పోలీసుల పాత్ర కీలకం. ప్రజలను నిరంతరం కాపాడుతూ వారి ధన, మాన, ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నారు. ఈరోజు అమరవీరుల సంస్మరణదినోత్సవం  పురస్కరించుకొని అల్వాల్ పోలీసులు అమరులైన తమ సిబ్బందికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం.. ఎస్ హెచ్ ఓ  ప్రశాంత్ మాట్లాడుతూ.. దేశాన్ని కాపాడేవారు సైనికుల అయితే, ప్రజలను కాపాడేది పోలీసులు అన్నారు. శాంతి పరిరక్షణ బాధ్యులతోపాటు, ట్రాఫిక్ సమస్యలు, హింసాత్మక సంఘటనలు వంటి ఎన్నో రకాల సమస్యలను పరిరక్షిస్తూ నిరంతరం ప్రజలకు సేవలు అందించేది పోలీసులేనని వివరించారు. శాంతి భద్రతలను నిరంతరం పరిరక్షిస్తూ, అసాంఘిక శక్తులను దీటుగా ఎదుర్కొని ప్రజలకు సేవలు అందిస్తున్న తమ పోలీస్ బృందాన్ని అభినందించారు. యూనిఫామ్ ధరించిన ప్రతి పోలీస్ మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో తమ జీవితాలను అంకితం చేసి అమరులైన పోలీసులకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాలినాయుడు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పట్టాదారు పుస్తకాల పంపిణీ:
కర్నూలు :  కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో రైతులకు  కొత్త...
By Hari Krishna 2026-01-02 10:40:37 0 174
Telangana
తెలుగు పద్యాల పోటీల్లో మెరిసిన విద్యార్థులు
​మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 21(భారత్ ఆవాజ్): మాతృభాష మనిషికి ప్రాణం వంటిదని, దాన్ని...
By Bittu Bittu 2026-02-21 15:29:02 0 334
Andhra Pradesh
స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత మార్ధాన్ రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్
భారతీయ జనతా యువమోర్చా   ప్రచురణ కొరకు...     *స్వామి వివేకానంద స్ఫూర్తి తో...
By Rajini Kumari 2026-01-11 09:37:38 0 122
Telangana
పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి సస్పెన్షన్.
ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-02-25 23:21:44 0 672
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com