ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం|

0
239

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలకు సమాజంలో భద్రత కల్పించేది పోలీసులే. పోలీసులు లేని సమాజాన్ని అసలు ఊహించలేం. ఏ వ్యవస్థ అయినా సాఫీగా సాగాలంటే పోలీసుల పాత్ర కీలకం. ప్రజలను నిరంతరం కాపాడుతూ వారి ధన, మాన, ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నారు. ఈరోజు అమరవీరుల సంస్మరణదినోత్సవం  పురస్కరించుకొని అల్వాల్ పోలీసులు అమరులైన తమ సిబ్బందికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం.. ఎస్ హెచ్ ఓ  ప్రశాంత్ మాట్లాడుతూ.. దేశాన్ని కాపాడేవారు సైనికుల అయితే, ప్రజలను కాపాడేది పోలీసులు అన్నారు. శాంతి పరిరక్షణ బాధ్యులతోపాటు, ట్రాఫిక్ సమస్యలు, హింసాత్మక సంఘటనలు వంటి ఎన్నో రకాల సమస్యలను పరిరక్షిస్తూ నిరంతరం ప్రజలకు సేవలు అందించేది పోలీసులేనని వివరించారు. శాంతి భద్రతలను నిరంతరం పరిరక్షిస్తూ, అసాంఘిక శక్తులను దీటుగా ఎదుర్కొని ప్రజలకు సేవలు అందిస్తున్న తమ పోలీస్ బృందాన్ని అభినందించారు. యూనిఫామ్ ధరించిన ప్రతి పోలీస్ మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో తమ జీవితాలను అంకితం చేసి అమరులైన పోలీసులకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాలినాయుడు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు వడ్డే ఓబన్న జయంతి
నేడు వడ్డే ఓబన్న జయంతి. తొలి తరం స్వాతంత్ర్య సమరయోధులు తెల్లదోరల అక్రమ పన్నువస్సుల తిరుగుబాటు...
By Rajini Kumari 2026-01-11 09:48:03 0 139
Andhra Pradesh
ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన కూటమిmP లు
*Photos:-* ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన కూటమి ఎంపీలు. కేంద్రమంత్రి...
By Rajini Kumari 2025-12-19 10:02:08 0 136
Telangana
ఆల్వాల్ సిఐ ప్రశాంత్ చేతుల మీదుగా చలివేంద్రాల ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం...
By Sidhu Maroju 2026-04-03 15:50:32 0 97
Telangana
40 లక్షల రూపాయలతో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులు మొదలు : కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*దాదాపు 40 లక్షల రూపాయలతో స్ట్రాం వాటర్ డ్రైన్ పనులు చెప్పట్టిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్* ఈ...
By Vadla Egonda 2025-06-11 15:58:19 0 2K
Andhra Pradesh
మదనపల్లె ఆసుపత్రిలో మందుల కొరత.. ఎమ్మెల్యే షాజహాన్ ఆగ్రహం.
శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన పత్రికా సమావేశంలో, ఎమ్మెల్యే...
By Pagadala Venkateswar 2026-03-20 11:49:04 0 106
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com