చీరాల వన్టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా పి. వెంకటేశ్వర రెడ్డి బాధ్యతల స్వీకారం
Posted 2026-02-04 16:35:59
0
183
చీరాల: చీరాల వన్టౌన్ పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా పి. వెంకటేశ్వర రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అద్దంకి పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై చీరాలకు వచ్చిన ఆయన అధికారికంగా విధుల్లో చేరారు.
ఈ సందర్భంగా ఎస్సై పి. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, చీరాల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామని, నేర నియంత్రణకు పోలీస్ శాఖలోని అన్ని విభాగాలతో సమన్వయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
అలాగే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, బాధితులకు తగిన న్యాయం చేకూర్చడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చట్ట పరిరక్షణలో రాజీ లేకుండా విధులు నిర్వహిస్తానని, ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భద్రాచలం లో ఉత్తరా ద్వారా దర్శనం
భద్రాచలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠ ఏకాదశి సందర్భంగా. ఉత్తర ద్వారా దర్శనం నిర్వహిస్తోంది....
Chandrababu Naidu: ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన 77వ గణతంత్రదిన వేడుకలు
ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ...
శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
సుండుపల్లె గ్రామపంచాయతీ కంచిపాటి వాండ్ల పల్లెలో నిర్వహించిన సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు...
పుంగనూరు చిత్తూరు జిల్లా కి బాయ్ బాయ్ అన్నమయ్య జిల్లా కు వెల్కం
చిత్తూరు జిల్లాతో ఉన్న సంబంధాన్ని తెంచుకుని, పుంగనూరు బుధవారం కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో...
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ చేసిన బిజెపి సైదా*
నందిగామ,ఎన్టీఆర్ జిల్లా
మదీనా...