అయ్యప్పల పాదయాత్ర- ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని

0
224

సికింద్రాబాద్ : అయ్యప్ప స్వామి మాలధారణ ఎన్నో జన్మల పుణ్యఫలం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్ వద్ద నుండి శబరిమల వరకు 120 మంది అయ్యప్పలు నిర్వహించే పాదయాత్ర ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ముందుగా ఆలయ పండితులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వినాయకుడిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అయ్యప్ప స్వాముల పాదయాత్ర ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గత 18 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పాదయాత్ర గా శబరిమల కు వెళ్ళి అయ్యప్పస్వామి ని దర్శించుకోవడం జరుగుతుందని శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి పాదయాత్ర బృందం సభ్యుడు వెంకటేష్ యాదవ్ జాదవ్ తెలిపారు. నవంబర్ 23 వ తేదీన శబరిమల కు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, ఆకుల హరికృష్ణ, నాగులు, ఓదెల సత్యనారాయణ, హన్మంతరావు తదితరులు ఉన్నారు.

ꜱɪᴅʜᴜᴍᴀʀᴏᴊᴜ

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ మద్యపు స్కాం: ED దర్యాప్తు చర్యలు |
ఆంధ్రప్రదేశ్ మద్యపు స్కాం: ED దర్యాప్తు చర్యలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కాం కేసులో...
By Bharat Aawaz 2025-09-20 10:36:11 0 765
Telangana
కరెంట్ షాక్ మృతులకు ₹8 లక్షలు.. బిల్లులు యథాతథం – డబుల్ రిలీఫ్!
హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ నియంత్రణ సంస్థ (TGERC) కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు పెద్ద...
By Sidhu Maroju 2026-04-02 12:44:21 0 103
Andhra Pradesh
గ్యాస్ పై ప్రజలు ఆందోళన చెందవద్దు మంత్రి అచ్చం నాయుడు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *విజ‌య‌వాడ‌, మార్చి 14, 2026*...
By Rajini Kumari 2026-03-14 12:19:15 0 137
Telangana
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరిపించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
*ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం..మర్రి రాజశేఖర్ రెడ్డి* తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా...
By Vadla Egonda 2025-06-02 12:00:17 0 2K
Andhra Pradesh
ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు
*ఆర్టీఈ చట్టాన్ని ఉల్లంఘించిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ*  *విద్యా హక్కు చట్టం...
By Boya Dasthagiri 2026-03-25 14:38:21 0 212
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com