Challa Narayana: ఏపీ పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు.

0
146

మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌ల ద్వారా ఒంటరి, వితంతు మహిళల లక్ష్యంగా మోసం చేస్తున్న ఘరానా నేరస్తుడిని పోలీసులు పట్టుకున్న వైనం

నిందితుడి నేరాల చిట్టా వివరించిన రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ ఇన్‌ఛార్జి డీఎస్పీ శ్రీకాంత్ 

 

గోదావరిలో పుణ్య స్నానాల కోసం అంటూ మహిళలను పిలిపించి నగలతో ఉడాయిస్తున్న వైనం

మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌ల ద్వారా ఒంటరి, వితంతు మహిళల లక్ష్యంగా మోసం చేస్తున్న ఘరానా నేరస్తుడిని తూర్పు గోదావరి పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ ఇన్‌ఛార్జి డీఎస్పీ శ్రీకాంత్ సదరు మోసగాడి నేరాల చిట్టాను వివరించారు. 

 

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పి.వడ్డురు గ్రామానికి చెందిన చల్లా నారాయణ (అలియాస్ నారాయణ కృష్ణ, అలియాస్ కృష్ణ నారాయణ) వివిధ పేర్లతో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో ఖాతాలు తెరిచి వితంతు, ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకునేవాడు. తాను గోవాలో బంగారు వ్యాపారి అని చెప్పుకుంటూ వివాహ ప్రతిపాదనలు పంపి, మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. ఆ తర్వాత జాతకంలో దోషాలు ఉన్నాయని, రాజమహేంద్రవరం వచ్చి గోదావరిలో పుణ్యస్నానం చేసి పూజలు చేస్తే అన్నీ సరిచూసుకుంటాయని నమ్మించేవాడు. అలాగే బంగారు నగలు ధరించి వస్తే తన తల్లిదండ్రులకు కూడా నచ్చుతారని మాయమాటలు చెప్పి మహిళలను రాజమహేంద్రవరం రప్పించేవాడు. ఇక్కడ స్నానాలు పూర్తయ్యాక పూజా సామగ్రి తెస్తానని చెప్పి, వారు తీసుకొచ్చిన నగలు, విలువైన వస్తువుల బ్యాగ్‌తో పరారయ్యేవాడు. 

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యతోనే మెరుగైన సమాజం
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు.   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.   ఘనంగా...
By Rajini Kumari 2026-02-07 11:52:16 0 164
Telangana
రెండో విడత పోలింగ్ లో కాంగ్రెస్ హవా నా..?
మండలం లో రేపు పోలింగ్ నిర్వహించన్ను నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన పళ్ళు వర్గాలు మెజారిటీ...
By Krishna Balina 2025-12-13 12:56:41 0 295
Andhra Pradesh
ఏం జరుగుతోంది యూపీలో సిగ్గు,సిగ్గు,సిగ్గు
ఏం జరుగుతోంది యూపీలో సిగ్గు,సిగ్గు,సిగ్గు ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన ఈ సంఘటన...
By Chennaiah Kati 2026-07-14 03:51:12 1 59
Andhra Pradesh
చీరాల పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
చీరాల - పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆటో ఢీకొని అక్కడికక్కడే...
By Vadlamudi NagaVenkat 2026-04-02 09:10:15 0 524
Andhra Pradesh
పుంగునూరు: చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ కొత్తూరు మురళి
రూరల్ సిఐ సాయి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 2న సోమల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద...
By Kothuru Murali 2026-04-25 03:06:55 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com