అద్దెకు తీసుకున్న కార్లను అమ్మేశాడు : తూర్పు మండల డీసీపీ బాలస్వామి

0
163

సికింద్రాబాద్: యజమానిని మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరినీ చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తూర్పు మండల డిసిపి బాల స్వామి తెలిపారు. నిందితుల నుండి ఏడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పర్ బస్తీకి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి శ్రీ లక్ష్మీ లాజిస్టిక్స్ కంపెనీలో డ్రైవర్ గా విధులు నిర్వహించేవాడని పోలీసులు పేర్కొన్నారు. కంపెనీ యజమాని గణేశ్వర్ వద్ద వాహనాలను అద్దెకు తీసుకొని నెలవారిగా డబ్బులు చెల్లించేవాడని అన్నారు. ఆరు నెలల పాటు వ్యాపారం సాఫీగానే సాగినప్పటికీ అనంతరం నెలవారీ డబ్బులు చెల్లించకపోగా వాహనాలను తిరిగి ఇవ్వాలని యజమాను కోరడంతో వాటిని విక్రయించినట్లు చెప్పాడు. వెంటనే గణేశ్వర్ చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేశారు. ప్రవీణ్ తన స్నేహితులైన రిజ్వాన్, అమరేందర్ లకు వాహనాలను విక్రయించినట్లు పోలీసులకు విచారణలో  తేలడంతో వారిని సైతం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
ఈ–పంట నమోదు వేగవంతం చేయాలి: జేసీ అపూర్వభారత్
కాకినాడ జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించిన ఈ–పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని...
By Ratna Sekhar 2026-02-12 08:38:50 0 79
Telangana
మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ పోలీసుల కార్డన్ సెర్చ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి :  మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 250 మంది పోలీస్...
By Sidhu Maroju 2025-11-19 07:23:25 0 101
Andhra Pradesh
డిల్లీ కి డోమ్... శత్రువుల గుండెల్లో రైళ్లు...
డిల్లీ రక్షణ కోసం కేంద్రం క్యాపిటల్ డోమ్ పేరు తో రక్షణ కవచాన్ని నిర్మించుకుంటుంది. శత్రువుల...
By Karapati Gopi 2025-12-28 03:25:49 0 260
Telangana
Exhibition
From January 1st 2026 exhibition opening. 
By G k Nookala 2025-12-29 14:21:22 0 229
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com