అద్దెకు తీసుకున్న కార్లను అమ్మేశాడు : తూర్పు మండల డీసీపీ బాలస్వామి

0
213

సికింద్రాబాద్: యజమానిని మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరినీ చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తూర్పు మండల డిసిపి బాల స్వామి తెలిపారు. నిందితుల నుండి ఏడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పర్ బస్తీకి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి శ్రీ లక్ష్మీ లాజిస్టిక్స్ కంపెనీలో డ్రైవర్ గా విధులు నిర్వహించేవాడని పోలీసులు పేర్కొన్నారు. కంపెనీ యజమాని గణేశ్వర్ వద్ద వాహనాలను అద్దెకు తీసుకొని నెలవారిగా డబ్బులు చెల్లించేవాడని అన్నారు. ఆరు నెలల పాటు వ్యాపారం సాఫీగానే సాగినప్పటికీ అనంతరం నెలవారీ డబ్బులు చెల్లించకపోగా వాహనాలను తిరిగి ఇవ్వాలని యజమాను కోరడంతో వాటిని విక్రయించినట్లు చెప్పాడు. వెంటనే గణేశ్వర్ చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేశారు. ప్రవీణ్ తన స్నేహితులైన రిజ్వాన్, అమరేందర్ లకు వాహనాలను విక్రయించినట్లు పోలీసులకు విచారణలో  తేలడంతో వారిని సైతం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ గొల్లపూడి లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
గొల్లపూడి లో ఘనంగా టిడిపి 44 వసంతాల ఆవిర్భావ వేడుకలు    ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల...
By Rajini Kumari 2026-03-30 04:49:39 0 81
Andhra Pradesh
రేపు, ఎల్లుండి మంచినీటి సరఫరా నిలుపుదల – నగరపాలక సంస్థ ప్రకటన
అరట్లకట్ట నుంచి విక్టోరియా వాటర్ వర్క్స్ ఫిల్టరేషన్ ప్లాంట్‌కు వెళ్లే ప్రధాన...
By Ratna Sekhar 2026-02-19 19:37:30 0 446
Andhra Pradesh
జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి : ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా లో  శాంతిభధ్రతలు అదుపులో ఉన్నాయని, నేరాలు అదుపు...
By Hari Krishna 2025-12-30 16:22:23 0 193
Andhra Pradesh
మీ భూమి – మీ హక్కు పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామ సచివాలయం వద్ద ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం.
మీ భూమి – మీ హక్కు పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామ సచివాలయం వద్ద ప్రభుత్వ రాజముద్రతో...
By Chennaiah Kati 2026-02-06 11:00:57 0 150
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com