తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ కార్యవర్గ సమావేశం

0
100

సికింద్రాబాద్ :  సికింద్రాబాద్ లోని రాయల్ రేవ్ హోటల్ లో తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం మూలంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్లు అయిందని అన్నారు . ఓటు బ్యాంకు రాజకీయం కోసమే తెలంగాణలోని రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్న చర్యలను వ్యతిరేకించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో పిటిషన్ వేయగా బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకంగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం పట్ల ఆయన స్పష్టత ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లకు, బిసి కులాలకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని, రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలని ఉద్దేశంతోనే కోర్టును ఆశ్రయించామని ఆ అంశాన్ని సైతం రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. దేశంలోనే మహారాష్ట్రలో రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జరిగిన ఎన్నికల మూలంగా ప్రజలు నష్టపోయారని అన్నారు. రాజ్యాంగానికి,సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు తాము కట్టుబడి ఉంటామని వెల్లడించారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Rajasthan
Rajasthan Eyes Tougher Penalties in New Biofuel Adulteration Law
The Rajasthan government is set to tighten regulations on biofuel adulteration, addressing...
By Bharat Aawaz 2025-07-17 07:42:11 0 945
Telangana
కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ను కలిసి తమ కాలనీ సమస్యలను విన్నవించిన రాయల్ ఎన్క్లేవ్ నివాసులు
మల్కాజిగిరి జిల్లా / అల్వాల్.   రాయల్ ఎన్‌క్లేవ్ - కాలనీ నివాసితులు సమావేశమై తమ...
By Sidhu Maroju 2025-08-02 15:16:32 0 632
Telangana
దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : ఎమ్మెల్యే కె.పి వివేకానంద్.|
*_నేటి తరానికి దీక్షా దివాస్  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్...
By Sidhu Maroju 2025-11-26 07:49:05 0 26
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com