తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ కార్యవర్గ సమావేశం

0
62

సికింద్రాబాద్ :  సికింద్రాబాద్ లోని రాయల్ రేవ్ హోటల్ లో తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం మూలంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్లు అయిందని అన్నారు . ఓటు బ్యాంకు రాజకీయం కోసమే తెలంగాణలోని రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్న చర్యలను వ్యతిరేకించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో పిటిషన్ వేయగా బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకంగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం పట్ల ఆయన స్పష్టత ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లకు, బిసి కులాలకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని, రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలని ఉద్దేశంతోనే కోర్టును ఆశ్రయించామని ఆ అంశాన్ని సైతం రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. దేశంలోనే మహారాష్ట్రలో రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జరిగిన ఎన్నికల మూలంగా ప్రజలు నష్టపోయారని అన్నారు. రాజ్యాంగానికి,సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు తాము కట్టుబడి ఉంటామని వెల్లడించారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
నవీన్ యాదవ్‌పై కేసు.. కాంగ్రెస్‌కు షాక్ |
హైదరాబాద్ జిల్లా:హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ నేత నవీన్...
By Bhuvaneswari Shanaga 2025-10-07 09:30:16 0 27
Telangana
"క్రిసలిస్ హైట్స్" ప్రైమరీ స్కూల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి వివేకానంద్.
జీడిమెట్ల డివిజన్ ఎం. ఎన్.రెడ్డి నగర్ లో గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన...
By Sidhu Maroju 2025-06-15 16:34:25 0 1K
Andhra Pradesh
కర్నూలు సభకు బస్సుల బాటలో ప్రజాస్రవంతం |
కర్నూలులో ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఎల్లుండి జరగనున్న సభకు ప్రజల రాకను...
By Bhuvaneswari Shanaga 2025-10-14 08:52:00 0 33
Education
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు: సిలబస్‌లో మార్పులు |
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు...
By Akhil Midde 2025-10-25 06:56:54 0 47
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com