రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

0
277

సికింద్రాబాద్ :  పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రసూల్ పురా నారాయణ జోపూడి లో నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కర్ణన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తూ గత ప్రభుత్వం వదిలేసిన రెండు పడక గదులను సైతం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. 288 మంది కుటుంబాలకు పట్టాలు అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. కంటోన్మెంట్ లోని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే పేదలకు ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు పేదలకు ఇల్లు నిర్మించి మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కంటోన్మెంట్ ప్రజలకు ఉన్న సమస్యలను తీర్చడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Bihar
Bihar Boosts Industrial Growth and Investment Drive
Bihar is steadily advancing its industrial growth and investment landscape through focused...
By Fathima Safa 2026-07-01 06:09:18 0 65
Andhra Pradesh
పామూరు మండలంలో హుండీ చోరీ
#పామూరు: ఆలయాల్లో దొంగతనం   పామూరు మండలం తూర్పు కట్టకింద పల్లిలోని శిర్డీ సాయిబాబా,...
By Balaji Reddy 2025-12-19 04:38:51 1 630
Andhra Pradesh
స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల!!
కర్నూలు : డోన్ :  డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర...
By Hari Krishna 2026-01-24 12:55:36 0 523
Andhra Pradesh
ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ప్రకాశం జిల్లాలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన మండల వెంకట్రావు మెమోరియల్ ఆధ్వర్యంలో...
By Benguluri Madhubabu 2026-04-24 07:55:59 0 238
Goa
Tourist Dies After Falling Into Rough Baga Sea Waters
A 34-year-old tourist from Karnataka lost his life after slipping from rocks along the...
By Navya Sree 2026-06-25 06:48:04 0 53
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com