రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

0
249

సికింద్రాబాద్ :  పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రసూల్ పురా నారాయణ జోపూడి లో నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కర్ణన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తూ గత ప్రభుత్వం వదిలేసిన రెండు పడక గదులను సైతం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. 288 మంది కుటుంబాలకు పట్టాలు అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. కంటోన్మెంట్ లోని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే పేదలకు ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు పేదలకు ఇల్లు నిర్మించి మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కంటోన్మెంట్ ప్రజలకు ఉన్న సమస్యలను తీర్చడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
గాలివీడు మండలంలో మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నూరివీడు గ్రామం నాగూరి వాడపల్లి వద్ద 18 రోజులు జరగనున్న మహాభారత...
By Benguluri Madhubabu 2026-04-06 11:46:49 0 176
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీ బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన చీఫ్ సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన సాయిప్రసాద్....✍
By Rajini Kumari 2026-02-28 13:03:28 0 129
Andhra Pradesh
దర్శి సీఎం. ఆర్. ఎఫ్ చెక్కుల పంపిణీ
దర్శిలో సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ  కూటమి ప్రభుత్వంనుంచి దర్శి నియోజకవర్గంలోని అనారోగ్య...
By Chennaiah Kati 2026-01-23 13:15:38 0 168
Telangana
నిజామాబాద్ 39 వ దివిజన్‌లో కార్పొరేటర్ సమీక్ష
నిజామాబాద్.39 వడివిజన్‌లో ఈ రోజుఉదయం కార్పొరేటర్ మురళీకృష్ణ జీవితంలో ఉన్నసమస్యలను...
By Sadaq Sadaq 2026-02-21 02:57:45 0 173
Andhra Pradesh
YS Jagan: నేడు తాడేపల్లికి వైఎస్ జగన్.
YS Jagan: నేడు తాడేపల్లికి వైఎస్ జగన్ 27-01-2026 Tue 10:48 | Andhra YS Jagan to Arrive in...
By Pagadala Venkateswar 2026-01-27 06:41:16 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com