వర్షపు నీటికి అడ్డుగా ఉన్న పైపులు : తొలగించిన రైల్వే అధికారులు

0
83

మేడ్చల్ మల్కాజ్గిరి : ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  కృషితో అల్వాల్ ఆదర్శనగర్ జేవియర్ స్కూల్ సమీపంలోని రైల్వే లైన్ ఆర్‌యు‌బి వద్ద వర్షపు నీరు వెళ్లేందుకు అడ్డుగా ఉన్న ఆర్‌సీసీ పైపులను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తొలగించారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండటంతో సమస్యను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే , అక్కడి వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న ఆర్‌సీసీ పైపులను తొలగించాలని సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్ఎం ని కలిసి విన్నవించగా వారు సానుకూలంగా స్పందించారు. ఫలితంగా ఈరోజు ఆర్‌యు‌బి కింద అడ్డుగా ఉన్న పైపులు తొలగించబడడంతో నీటి ప్రవాహం సులభంగా సాగేందుకు మార్గం సుగమమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, అల్వాల్ అసిస్టెంట్ ఇంజనీర్ వరుణ్, వర్క్ ఇన్స్పెక్టర్ రామారావు, బిఆర్ఎస్ నాయకులు యాదగిరి గౌడ్ ఫ్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

 

Search
Categories
Read More
BMA
How BMA Powers Your Career Growth 🚀
How BMA Powers Your Career Growth 🚀 At Bharat Media Association (BMA), we believe that every...
By BMA (Bharat Media Association) 2025-04-27 18:58:33 0 2K
Andhra Pradesh
అంబుజా ప్లాంట్ వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళన |
విశాఖపట్నం జిల్లా పెడగంట్యాడ ప్రాంతంలో ప్రతిపాదిత అంబుజా సిమెంట్ ప్లాంట్‌పై స్థానికులు...
By Bhuvaneswari Shanaga 2025-10-08 11:44:56 0 22
Andhra Pradesh
AI బూమ్‌కు 'బబుల్' ప్రమాదం: IMF హెచ్చరిక |
కృత్రిమ మేధస్సు (AI) రంగంలోకి వస్తున్న భారీ పెట్టుబడులపై అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి...
By Meghana Kallam 2025-10-10 10:49:04 0 160
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com