వర్షపు నీటికి అడ్డుగా ఉన్న పైపులు : తొలగించిన రైల్వే అధికారులు

0
229

మేడ్చల్ మల్కాజ్గిరి : ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  కృషితో అల్వాల్ ఆదర్శనగర్ జేవియర్ స్కూల్ సమీపంలోని రైల్వే లైన్ ఆర్‌యు‌బి వద్ద వర్షపు నీరు వెళ్లేందుకు అడ్డుగా ఉన్న ఆర్‌సీసీ పైపులను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తొలగించారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండటంతో సమస్యను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే , అక్కడి వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న ఆర్‌సీసీ పైపులను తొలగించాలని సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్ఎం ని కలిసి విన్నవించగా వారు సానుకూలంగా స్పందించారు. ఫలితంగా ఈరోజు ఆర్‌యు‌బి కింద అడ్డుగా ఉన్న పైపులు తొలగించబడడంతో నీటి ప్రవాహం సులభంగా సాగేందుకు మార్గం సుగమమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, అల్వాల్ అసిస్టెంట్ ఇంజనీర్ వరుణ్, వర్క్ ఇన్స్పెక్టర్ రామారావు, బిఆర్ఎస్ నాయకులు యాదగిరి గౌడ్ ఫ్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

 

Search
Categories
Read More
Andhra Pradesh
క్రీడాస్ఫూర్తితో విద్యార్థులు ఎదగాలి: చల్లపల్లి నరసింహరెడ్డి.
మదనపల్లె మండలం, గంగన్నగారిపల్లెలోని శ్రీ కృష్ణ చైతన్య ఫార్మసీ, నర్సింగ్ కళాశాలలో వార్షిక...
By Pagadala Venkateswar 2026-01-23 06:46:25 0 103
Andhra Pradesh
జయహో హిందూ ముస్లిం ఏక్ హై
జైహో జైహో హిందూ ముస్లిం ఎక్ హో..   జైహో జైహో సబ్ హిందూస్థాని ఏక్ హో...   ఈరోజు...
By Rajini Kumari 2026-01-28 13:03:25 0 121
Telangana
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం- మంత్రి పొంగులేటి.|
హైదరాబాద్: పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డుల జీవో. వచ్చే ఏడాది ఇళ్ల స్థలాల కేటాయింపు పై తీపి...
By Sidhu Maroju 2025-12-20 10:49:21 0 154
Andhra Pradesh
టీటీడీ దర్శనం టికెట్స్ సేవలు విడుదల
*🙏టిటిడి దర్శనం టికెట్స్, సేవలు విడుదల🙏*   🌹మార్చి-2026 నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత...
By Rajini Kumari 2025-12-16 09:53:02 0 120
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com