అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు : దర్శించుకున్న ఎమ్మెల్యే

0
233

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు సూర్యనగర్ కాలనీ ఫేజ్ 2లోని దుర్గ భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై, అమ్మవారికి పూజలు అర్పించి, భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నవరాత్రులు మహిళ శక్తి ప్రాధాన్యతను గుర్తుచేసే పవిత్ర సందర్భమని, ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో భక్తి, సాంఘిక సేవలకు దోహదపడతాయని తెలిపారు.  ఈ కార్యక్రమంలో అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు డోలి రమేష్, సురేందర్ రెడ్డి,  స్థానిక కాలనీవాసులు, భక్తులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
*నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పొగమంచు.. పదుల సంఖ్యలో వాహనాలు ఢీ*
ఉత్తరాదిలో వాయు కాలుష్యం (Air pollution) తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యతా సూచీ (AQI) ప్రమాదకర...
By SivaNagendra Annapareddy 2025-12-13 07:59:39 0 299
Himachal Pradesh
शिमला की खोती रौनक पर हाई कोर्ट की चिंता: पैदल संस्कृति खतरे में
हिमाचल प्रदेश #हाई_कोर्ट ने शिमला नगर की बदलती स्थिति पर गंभीर चिंता जताई है। न्यायालय ने कहा कि...
By Pooja Patil 2025-09-11 11:12:00 0 226
Andhra Pradesh
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరీక్షణ బాబుగారు....
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ...
By Chennaiah Kati 2026-02-02 06:53:09 0 178
Andhra Pradesh
రోడ్డు నందు వేరు శెనగ కాయలు వ్యాపారం
విశాఖ పట్నం కలెక్టర్ కార్యలయం ముందు రోడ్డు నందు ఓ భార్య భర్తలు వేరు శెనగ కాయలు ఉదయం11గంటలు నుండి...
By Mobbu Venkatramana 2026-01-23 11:49:46 0 487
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com