లయోలా కాలేజ్ లో మిల్లెట్ ఫెస్టివల్

0
299

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్‌లోని లయోలా డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో మహిళా సాధికారతకు తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన "Millet Festival for Women Empowerment" అనే ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.  ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖా మంత్రివర్యులు శ్రీమతి సీతక్క , మల్కాజ్‌గిరి శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి , న్యూట్రి హబ్ – ఐకార్-ఐఐఎంఆర్ సీఈఓ మరియు డైరెక్టర్ డా. జాన్సన్ స్టాండ్లీ గారు ముఖ్య అతిథులుగా హాజరై, తమ సందేశాలతో కార్యక్రమానికి విశేషంగా మేళవించారు.

ఈ సందర్భంగా, మిల్లెట్ల పోషక విలువలపై అవగాహన పెంపుదల, ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతపై ప్రత్యేకంగా చర్చించబడింది. మిల్లెట్ ప్రదర్శన స్టాల్స్, అవగాహన సెషన్లు, మరియు మహిళా ఔత్సాహికుల అభివృద్ధిపై దృష్టి సారించిన ఈ వేడుక, విద్యార్థులు మరియు స్థానికుల నుండి విశేష స్పందన పొందింది.

కార్యక్రమంలో లయోలా కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ ఫ్రాన్సిస్ జేవియర్, వైస్ చైర్మన్ ఫాదర్ అమర్ రావు, ప్రిన్సిపల్ ఫాదర్ డాక్టర్ ఎన్.బి.బాబు, నిర్వాహకులు డాక్టర్ భవాని, అలాగే కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు, మిల్లెట్ స్టాల్స్ నిర్వాహకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎం అయినా భార్యను అడగాల్సిందే... పల్నాడు పర్యటనలో కోల్డ్‌ప్రెస్డ్ నూనె కొనుగోలు చేసిన చంద్రబాబు.
  సీఎం అయినా భార్యను అడగాల్సిందే... పల్నాడు పర్యటనలో కోల్డ్‌ప్రెస్డ్ నూనె కొనుగోలు...
By Pagadala Venkateswar 2026-06-20 13:44:58 0 55
Lakshdweep
Lakshadweep Strengthens Water Resource Management
Lakshadweep continues to enhance water resource management by promoting sustainable freshwater...
By Fathima Safa 2026-06-29 08:11:56 0 42
Business & Finance
TAN Registration for Hassle-Free TDS Compliance
TAN (Tax Deduction and Collection Account Number) Registration is mandatory for businesses and...
By Navya Sree 2026-07-21 06:05:11 0 46
Andhra Pradesh
పెండ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
కంచికచర్ల మండలం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  పెండ్యాల...
By Patan Khuddus 2026-05-13 16:37:38 0 255
Andhra Pradesh
మదనపల్లి: రూ. 6. 4కోట్లతో స్వచ్ఛభారత్ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ.
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-05-27 06:16:43 0 77
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com