లయోలా కాలేజ్ లో మిల్లెట్ ఫెస్టివల్

0
193

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్‌లోని లయోలా డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో మహిళా సాధికారతకు తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన "Millet Festival for Women Empowerment" అనే ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.  ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖా మంత్రివర్యులు శ్రీమతి సీతక్క , మల్కాజ్‌గిరి శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి , న్యూట్రి హబ్ – ఐకార్-ఐఐఎంఆర్ సీఈఓ మరియు డైరెక్టర్ డా. జాన్సన్ స్టాండ్లీ గారు ముఖ్య అతిథులుగా హాజరై, తమ సందేశాలతో కార్యక్రమానికి విశేషంగా మేళవించారు.

ఈ సందర్భంగా, మిల్లెట్ల పోషక విలువలపై అవగాహన పెంపుదల, ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతపై ప్రత్యేకంగా చర్చించబడింది. మిల్లెట్ ప్రదర్శన స్టాల్స్, అవగాహన సెషన్లు, మరియు మహిళా ఔత్సాహికుల అభివృద్ధిపై దృష్టి సారించిన ఈ వేడుక, విద్యార్థులు మరియు స్థానికుల నుండి విశేష స్పందన పొందింది.

కార్యక్రమంలో లయోలా కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ ఫ్రాన్సిస్ జేవియర్, వైస్ చైర్మన్ ఫాదర్ అమర్ రావు, ప్రిన్సిపల్ ఫాదర్ డాక్టర్ ఎన్.బి.బాబు, నిర్వాహకులు డాక్టర్ భవాని, అలాగే కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు, మిల్లెట్ స్టాల్స్ నిర్వాహకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఉదయం 11 గంటలకు
కోడుమూరు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనంతరత్నం మాదిగ కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం కర్నూల్ మండల...
By mahaboob basha 2025-07-12 11:29:00 0 1K
Andhra Pradesh
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ...
By John Baji 2026-01-04 03:54:15 0 108
Andhra Pradesh
కె.నాగలాపురం గ్రామంలో 26 తేదీన యాక్సిడెంట్
కర్నూలు జిల్లా కె.నాగలాపురం గ్రామంలో 26 తేదీన యాక్సిడెంట్ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన...
By mahaboob basha 2025-08-31 00:49:50 0 378
Telangana
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:20:27 0 131
Telangana
ప్రభుత్వ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం విద్య ద్వారానే వ్యక్తి జీవితంలో మార్పులు... కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి...
By Gangaram Rangagowni 2025-12-24 10:51:10 0 134
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com