గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్.

0
347

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఘన స్వాగతం పలికి, అనంతరం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం, రెడ్డిపాలెం నుండి స్వర్ణ భారతి నగర్ వరకు ర్యాలీలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.

శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసినవి:

👉 గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని,48వ డివిజన్ పరిధిలోని,రెడ్డిపాలెం నందు రూ.10.99 కోట్ల వ్యయంతో పూర్తయిన 22 పనుల

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవములు .

👉 గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని,46వ డివిజన్ పరిధిలోని రూ.29.75 కోట్ల వ్యయంతో పూర్తయిన 127 పనుల శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవములు.

👉గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని,47వ డివిజన్ పరిధిలోని రూ.8.11 కోట్ల వ్యయంతో పూర్తయిన 28 పనుల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవములు.

👉 గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని,41వ డివిజన్, స్వర్ణ భారతి నగర్ నందు గుంటూరు నగర అభివృద్ధిలో కీలకమైన రూ.48 కోట్ల వ్యయంతో 4.25 కి.మీ. ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ - 3 పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

👉అనంతరం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని,41 వ డివిజన్,స్వర్ణ భారతి నగర్,శిల్పారామం నందు జరిగిన బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీ కోవెలమూడి రవీంద్ర గారు,గుంటూరు తూర్పు శాసనసభ్యులు శ్రీ మొహమ్మద్ నసీర్ అహ్మద్ గారు, గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు శ్రీమతి గళ్ళా మాధవి గారు,గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా గారు, గుంటూరు నగర పాలక సంస్థ శ్రీ కమిషనర్ పులి శ్రీనివాసులు గారు,లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు,శ్రీ డేగల ప్రభాకర్ గారు, పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్పొరేటర్లు,రాష్ట్ర జిల్లా,మండల,గ్రామ,స్థాయి నాయకులు,అభిమానులు,కార్యకర్తలు, స్థానిక ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
The Sentinel of the Streets: The Unwavering Journey of Shri K. Narayan Naik
Bridging the Gap Between Governance and the Common Citizen: A Legacy of Integrity, Traffic...
By Kalaga Sailaja 2026-07-14 11:19:58 0 60
Andhra Pradesh
కడివెళ్ల గ్రామానికి చర్చి ఓపెనింగ్ లో బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్మించిన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో...
By Boya Dasthagiri 2026-05-04 13:44:38 0 118
Andhra Pradesh
Renew global energy inauguration
రీన్యూ ఎనర్జీ గ్లోబల్ (ReNew) సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల పెట్టుబడితో...
By G k Nookala 2026-04-23 04:58:38 0 149
Andhra Pradesh
అక్రమ కేసులు వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
మదనపల్లె జిల్లా సాధన కోసం గతంలో నిరసనల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి...
By Pagadala Venkateswar 2026-05-26 05:57:50 0 109
Andhra Pradesh
​గ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి: CPM.
వంట గ్యాస్‌పై ₹60, వాణిజ్య సిలిండర్‌పై ₹115 పెంచడాన్ని సీపీఎం అన్నమయ్య జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-08 04:57:06 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com