బిఆర్ఎస్ పార్టీని దిక్కరించిన కవితను సస్పెండ్ చేయడం కరెక్టే : మాజీ మంత్రి మల్లారెడ్డి

0
331

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితపై బిఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు.బోయిన్ పల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.బిఅర్ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని అన్నారు. కేసిఆర్ కు కొడుకు, కూతురు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమని అన్నారు.బిఆర్ఎస్ పార్టీని ధిక్కరించే వారికి ఇదే గతి పడుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయని, ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉండడం సహజమని తెలిపారు.కాలేశ్వరం విషయంలో సిబిఐ కాదు ఎవరు ఏమి చేయలేరని, కెసిఆర్ లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణకు నాయకుడిగా ఉండడం మనందరి అదృష్టమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలేశ్వరం కూలిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కాలేశ్వరం లాంటి బహుళార్థసాధక ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కేసిఆర్ కే దక్కిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

    - sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
బాపట్ల జిల్లా రామాపురంలో శక్తి టీమ్ తో స్టూడెంట్స్, బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ రామపురం నందు...
By Vadlamudi NagaVenkat 2026-04-04 09:24:33 0 102
Andhra Pradesh
ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు
రాయచోటి పట్టణం కొత్తపేట ముస్తఫా వీధిలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-03-08 13:24:57 0 126
Andhra Pradesh
ప్రముఖ ప్రవచనకర్త శ్రీ శ్రీ శ్రీ మద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం !!
కర్నూలు... ఆధ్యాత్మిక ప్రవచనాలతోనే యువతకు మార్గదర్శనం- మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ...
By Hari Krishna 2026-01-04 05:15:47 0 167
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడు
తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత అమరావతి...
By Benguluri Madhubabu 2026-04-02 14:15:41 0 66
Andhra Pradesh
మైలవరం నియోజకవర్గం 41,594 మందికి 18. సున్నా ఏడు కోట్ల పింఛన్లు పంపిణీ
మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్లు.   మైలవరం ఎమ్మెల్యే వసంత...
By Rajini Kumari 2026-02-28 13:00:10 0 97
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com