ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోట్ల !!

0
102

కర్నూలు : నంద్యాల : డోన్ :

డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన మొత్తం *రూ.31,38,412/-* (అక్షరాలా ముప్పై ఒక లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు )విలువైన చెక్కులను గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,గడచిన 15 నెలల కాలంలో డోన్ నియోజకవర్గ పరిధిలోని ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని గౌరవ శాసనసభ్యులు తెలిపారు. ఈ కాల వ్యవధిలో నియోజకవర్గానికి చెందిన మొత్తం 390 మంది లబ్ధిదారులకు రూ.4,02,49,951/-(అక్షరాల నాలుగు కోట్ల రెండు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఒకటి రూపాయలు)విలువైన ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే గారు వెల్లడించారు.

ఆరోగ్య చికిత్సలు, అత్యవసర వైద్య అవసరాలు, ప్రమాదాలు మరియు ఇతర సంక్షేమ కారణాల నిమిత్తం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపశమనం కలిగించిందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న దానికి ఇది నిదర్శనమని ఎమ్మెల్యే గారు అన్నారు.

భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందేలా తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో ఖరారైన వైయస్ షర్మిల పర్యటన
కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుంగనూరు పర్యటన ఖరారైంది. ఉపాధి హామీ పరిరక్షణ...
By Kothuru Murali 2026-02-04 16:14:35 0 95
Telangana
శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం- పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని...
By Sidhu Maroju 2025-11-29 12:08:22 0 144
Andhra Pradesh
విశాఖ కలెక్టర్ బదిలీ. కొత్త కలెక్టర్ బాధ్యత లు స్వీకరణ
విశాఖ కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ రోజు అక్కడ బాధ్యత లు...
By Mobbu Venkatramana 2026-04-01 11:10:57 0 80
Telangana
భారీ వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన బిఆర్ఎస్ మాజీ మంత్రులు
సికింద్రాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముంపుకు గురైన రాంగోపాల్ పేట్ లోని పలు...
By Sidhu Maroju 2025-09-21 07:00:06 0 237
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com