పర్యావరణ పరిరక్షణ మక్తాల పద్మ జలంధర్ గౌడ్ కు 2025 సేవా భూషణ్ జాతీయస్థాయి పురస్కారం

0
329

హైదరాబాద్ :  పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగిన మహాకవి దాశరధి కృష్ణమాచార్యుల శతజయంతి సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అవార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తాల పద్మ జలంధర్ గౌడ్ కు సేవా భూషణ్ జాతీయ స్థాయి ఆవార్డును లయన్ డా. జి మహేంద్ర కుమర్, డిస్ర్టిక్ట్ గవర్నర్, 320-ఎ, లయన్ డా. ఇ.యస్. సత్యనారాయణ చేతుల మీదుగా అవార్డును అందజేశారు. అనంతరం సేవా భూషణ్ జాతీయ అవార్డు గ్రహీత జలంధర్ గౌడ్ మాట్లాడుతూ..  ఈ అవార్డు నాకు రావడం ఎంతో సంతోషంగా గర్వకారణంగా ఉందన్నారు . ఈ అవార్డు రావడం నాపై మరింత బాధ్యతని పెంచుతుందనీ అన్నారు.  ప్రస్తుతం పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం అనేక విషపూరితమైన వాయువుల వల్ల పర్యావరణం ప్రకోపించడం ఓజోన్ పొర మందగించి పోవడంతో సూర్యుడు ద్వారా వచ్చే కిరణాలు నేరుగా భూమిపై పడటం వల్ల జీవకోటి అనారోగ్య పాలవుతుందని తెలిపారు.ప్రస్తుతం పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో.. ఎప్పుడు ఎండ ఉంటుంది, ఎప్పుడు వర్షం పడుతుంది.. అనేది తెలియకుండా పోతుందనీ వెల్లడించారు. ప్రస్తుతం స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందనీ దానిని అధిగమించాలంటే ప్రస్తుతం ఉన్న తరుణంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ, తమ పుట్టినరోజు పెళ్లిరోజు మరియు ప్రత్యేకమైన రోజులలో తమకు వీలైన చోట మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా ప్రయత్నం చేసినట్లయితే. పచ్చదనాన్ని పెంచుకోవడంతో పాటు గ్లోబల్ వార్మింగ్ ను అడ్డుకట్ట వేసినవారమవుతాం అలాగే ప్రతి ఇంటి వద్ద షాపుల వద్ద మొక్కలను, చెట్లను పెంచే వారికి ప్రభుత్వం పన్నుల్లో రాయితీలు ఇస్తే అది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో మక్తాల ఫౌండేషణ్ సభ్యులు మక్తాల పద్మవతి, కె. వెంకటేష్, అంజనేయులు, ఎ. కృష్ణ తదితరులు పాల్గోన్నారు.

    SIDHUMAROJU

Search
Categories
Read More
Telangana
ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ యూకేజీ తరగతులు ప్రారంభం
హైదరాబాద్‌:ఇక ప్రభుత్వ పాఠశాలలోనూ నర్సరీ,ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు తెలంగాణ...
By Vadla Egonda 2025-06-11 16:05:24 0 2K
Andhra Pradesh
Chief Minister N. Chandrababu Naidu expressed profound sorrow over the tragic deaths of seven children in two separate incidents that occurred on Sunday
Chief Minister N. Chandrababu Naidu expressed profound sorrow over the tragic deaths of seven...
By BMA ADMIN 2025-05-19 11:51:46 0 2K
Andhra Pradesh
Passbooks: ఏపీ రైతులకు శుభవార్త.. జనవరి 2న వీటిని ఉచితంగా తీసుకోండి!
ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరంలో రైతులకు శుభవార్త చెబుతోంది. ఐతే.. దీని వల్ల రైతులకు కొత్తగా కలిగే...
By Siva Bhaskar 2025-12-27 03:57:17 0 362
Andhra Pradesh
పేదల పొట్ట కొట్టే చర్యలను సహించం: కాంగ్రెస్
పుంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మురళీ మోహన్ యాదవ్ ఆదివారం మదనపల్లెలో మాట్లాడుతూ,...
By Kothuru Murali 2026-01-11 13:09:09 0 109
Andhra Pradesh
Challa Narayana: ఏపీ పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు.
మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌ల ద్వారా ఒంటరి, వితంతు మహిళల లక్ష్యంగా మోసం చేస్తున్న ఘరానా...
By Pagadala Venkateswar 2026-02-01 08:30:22 0 86
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com