నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

0
238

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  తెలంగాణ రాష్ట్ర విద్యుత్, ఆర్థిక శాఖ, మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకై నిధులు కేటాయింపు, విద్యుత్ సబ్ స్టేషన్ ల ఏర్పాటు , అలాగే ప్రజావసరాల సమస్యలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.  అదే విధంగా, వెంకటాపురం డివిజన్ యాదమ్మనగర్‌లోని పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల వారు నివసించే ప్రాంతంలో విద్యుత్ బల్క్ మీటర్లు ఏర్పాటు చేయాలనీ ఎమ్మెల్యే  విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై వినతిపత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే  అభ్యర్థనకు ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. మల్కాజ్గిరి ప్రజల సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చారు.

   Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
రాజధాని కార్మిక వాడల్లో డిసెంబర్ 15న ఎర్రజెండాల ఆవిష్కరణ
*ఉండవల్లిలో మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి శనివారం నాడు మాట్లాడుతున్న సిఐటియు గుంటూరు జిల్లా...
By Rajini Kumari 2025-12-13 09:59:44 0 92
Andhra Pradesh
భవాని దీక్షలు విరమణ కార్యక్రమం మొదటి రోజు
నిజం: భవానీ దీక్ష విరమణ మొదటి రోజు కార్యక్రమాలు              ...
By Rajini Kumari 2025-12-12 17:06:49 0 110
Odisha
NHRC Warns Odisha Govt Over Non-Payment in Maternal Death Case
The National Human Rights Commission (NHRC) has reprimanded the Odisha government for failing to...
By Bharat Aawaz 2025-07-17 08:30:18 0 1K
Telangana
నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన నిందితుడు రియాజ్ పోలీసులకు దొరికిండు.
హైదరాబాద్:  నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారైన రియాజ్ పోలీసులకు...
By Sidhu Maroju 2025-10-19 12:55:17 0 129
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com