నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

0
324

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  తెలంగాణ రాష్ట్ర విద్యుత్, ఆర్థిక శాఖ, మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకై నిధులు కేటాయింపు, విద్యుత్ సబ్ స్టేషన్ ల ఏర్పాటు , అలాగే ప్రజావసరాల సమస్యలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.  అదే విధంగా, వెంకటాపురం డివిజన్ యాదమ్మనగర్‌లోని పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల వారు నివసించే ప్రాంతంలో విద్యుత్ బల్క్ మీటర్లు ఏర్పాటు చేయాలనీ ఎమ్మెల్యే  విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై వినతిపత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే  అభ్యర్థనకు ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. మల్కాజ్గిరి ప్రజల సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చారు.

   Sidhumaroju 

Search
Categories
Read More
Haryana
Delhi-Haryana Police Bust Kapil Sangwan, Takkar Gangs |
Delhi and Haryana police carried out coordinated raids against the Kapil Sangwan and Takkar...
By Pooja Patil 2025-09-16 05:28:35 0 529
Andhra Pradesh
ఉత్తమ అవార్డు అందుకున్న సబ్ రిజిస్టర్ శాఖ ఉద్యోగి అమీర్.
సంతనూతలపాడు: సంతనూతలపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ డి అమీర్. ఈ మేరకు...
By Gadiyapudi Narendra 2026-01-27 05:52:53 0 159
Telangana
హనుమకొండ జిల్లాలో దారుణం..
భరత్ ఆవాజ్ (ప్రతి నిధి):  హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో ధారావత్ రాజకుమార్...
By Prashanth Goindla 2026-02-26 12:00:29 0 142
Andhra Pradesh
చీరాలలో ఘనంగా ప్రింటర్స్ డే వేడుకలు
చీరాల:  ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని ముద్రణ రంగంలో వృద్దిలోకి...
By Gadiyapudi Narendra 2026-02-24 16:56:05 0 122
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com