నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

0
282

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  తెలంగాణ రాష్ట్ర విద్యుత్, ఆర్థిక శాఖ, మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకై నిధులు కేటాయింపు, విద్యుత్ సబ్ స్టేషన్ ల ఏర్పాటు , అలాగే ప్రజావసరాల సమస్యలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.  అదే విధంగా, వెంకటాపురం డివిజన్ యాదమ్మనగర్‌లోని పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల వారు నివసించే ప్రాంతంలో విద్యుత్ బల్క్ మీటర్లు ఏర్పాటు చేయాలనీ ఎమ్మెల్యే  విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై వినతిపత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే  అభ్యర్థనకు ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. మల్కాజ్గిరి ప్రజల సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చారు.

   Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
Jagan Mohan Reddy: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన జగన్.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలోకి వచ్చిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి...
By Pagadala Venkateswar 2026-02-11 06:09:36 0 24
International
EAM Dr. S. Jaishankar Meet FBI Director Kash Patel.....
EAM Dr. S. Jaishankar: Great to meet FBI Director Kash Patel today.  Appreciate our strong...
By Bharat Aawaz 2025-07-03 07:30:16 0 2K
Telangana
నిజామాబాద్‌: ఓస్టల్ బైలెట్ లు బందోబస్తుతో కౌంటింగ్‌ హాల్‌కు తరలించాలి.
ఎనికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బైలెట్ ద్వార తమఓటు హక్కునువినియోగించుకొనుటకు విలిగా...
By Sadaq Sadaq 2026-02-08 12:44:10 0 66
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com