Jagan Mohan Reddy: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన జగన్.

0
88

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలోకి వచ్చిన వైసీపీ సభ్యులు

గవర్నర్ ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలిన వైనం

ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ పట్టుబట్టిన వైసీపీ

 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. మరోపక్క, శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. 'ప్రతిపక్ష హోదా ఇవ్వాలి' అనే ప్లకార్డులను, బ్యానర్లను పట్టుకుని వీరు అసెంబ్లీకి చేరుకున్నారు. వైసీపీ సభ్యులంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. గేట్ నెంబర్ 4 నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వీరు సభలోకి వెళ్లారు. 

 

గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగానికి పదేపదే ఆటంకం కలిగిస్తూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినదించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, 11 నిమిషాల వ్యవధిలోనే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసి, సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. 

 

సభ నుంచి బయటకు వచ్చిన వెంటనే జగన్ తన కాన్వాయ్ లో తాడేపల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. దీంతో, సభలో జగన్ ఏదైనా మాట్లాడతారేమోనని ఎదురు చూసినవారంతా నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం సభలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో యాచకుడి మృతి
పుంగనూరు పట్టణంలో రోడ్లపై యాచించుకుంటూ జీవనం సాగిస్తున్న దిలావర్ (65) నాగపాళ్యంలో ఒక షాపు వద్ద...
By Kothuru Murali 2026-02-03 09:30:07 0 106
Andhra Pradesh
మదనపల్లిలో మద్యం షాపు వద్ద గొడవ: యువకులపై హత్యాయత్నం.
మదనపల్లి పట్టణంలోని బాలాజీనగర్ మద్యం షాపు వద్ద బుధవారం రాత్రి యువకుల మధ్య జరిగిన ఘర్షణ...
By Pagadala Venkateswar 2026-02-26 11:16:53 0 75
Andhra Pradesh
నిరుద్యోగులకు నగరపాలక సంస్థ స్పోర్ట్స్ కోచులుగా పనిచేయుటకు దరఖాస్తుల స్వీకరణ
విజయవాడ నగరపాలక సంస్థ  12-01-2026      *నిరుద్యోగులకు నగరపాలక సంస్థ...
By Rajini Kumari 2026-01-12 14:06:32 0 185
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com