వినాయక చవితిని మూడు రోజులు జరుపుకోవాలని:- ఎస్.ఐ చిరంజీవి

0
584

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో వినాయక చవితి పండుగను మూడు రోజులపాటు జరుపుకోవాలని మంగళవారం ఎస్సై చిరంజీవి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు పట్టణంలో గతంలో వినాయక చవితి పండుగను నిర్వాహకులు మూడు రోజులపాటు జరుపుకునే వారన్నారు. ఈ ఏడాది వినాయక పండుగ సంబరాలను ఐదు రోజులపాటు జరుపుకుంటామని నిర్వాకులు తన దృష్టికి తీసుకొని వచ్చారన్నారు. అయితే ఆదోనిలో వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని ఐదు రోజులకు జరుపుతున్నందున పోలీసులు బందోబస్తును గూడూరులో జరిగే వినాయక నిమజ్జనానికి భద్రత సిబ్బందిని ఏర్పాటు చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుందని కావున వినాయక కమిటీ నిర్వాహకులు , పోలీసు సిబ్బందికి సహకరించి మూడు రోజులపాటు వినాయక ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. దీంతో పాటు ఫైర్, విద్యుత్ శాఖల అధికారుల వద్ద నుండి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్ళు /మండపాలు వద్ద ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన పోలీసు సిబ్బందిని జిల్లా అధికారులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కావున వినాయక మండపాల కమిటీ నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించి మూడు రోజులపాటు ఉత్సవాలను జరుపుకునే విధంగా దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : వీబీజీ-రామ్ పథకంపై ఈనెల 9న అవగాహన
సదుం ఎంపీడీవో రాధారాణి మాట్లాడుతూ, ఈనెల 9న వీబీజీ-రామ్ పథకంపై ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు...
By Kothuru Murali 2026-03-08 08:18:15 0 113
Andhra Pradesh
మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ
అమ‌రావ‌తి...   మున్సిప‌ల్,పంచాయ‌తీ రాజ్ శాఖ అధికారుల‌తో మంత్రి...
By Rajini Kumari 2026-02-23 14:16:46 0 151
Telangana
మహిళల సాధికారతకు అంబేద్కర్ చూపిన మార్గం ఆదర్శం: మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి|
హైదరాబాద్, మే 7: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం సమాజ అభివృద్ధికి మార్గదర్శకం...
By Avunoori Mahesh 2026-05-07 12:26:51 0 140
Tamilnadu
Hinduja Group Pledges ₹7,500 Cr for Tamil Nadu EV Ecosystem |
The Hinduja Group has committed ₹7,500 crore to develop Tamil Nadu’s electric vehicle...
By Pooja Patil 2025-09-16 10:19:24 0 665
Andhra Pradesh
విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జిగా నిర్మల
రాష్ట్రంలో వివిధ కోర్టులలో సివిల్ జడ్జ్ సీనియర్ డివిజనల్గా పనిచేస్తున్న15 మందికి జిల్లా సెషన్స్...
By Boiena Rajesh 2026-04-12 00:17:57 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com