ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన

0
461

 

 

 

 

 మెదక్ జిల్లా:  మెదక్  నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కారం కోసం ఆదివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖాముఖి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల నుండి స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం కోసం అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గం ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని అప్పటికప్పుడే సమస్యల పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్తులో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ నియోజకవర్గంలో చేయడం జరిగిందని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం పనిచేస్తుందని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ మండల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

   -sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పది పరీక్షల్లో గుంటూరు జిల్లా నుంచే స్టేట్ టాపర్‌లు రావాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు, ఐ.ఏ.ఎస్. పిలుపునిచ్చారు.
గుంటూరు, జనవరి 22 : పది పరీక్షల్లో గుంటూరు జిల్లా నుంచే స్టేట్ టాపర్‌లు రావాలని జిల్లా...
By John Baji 2026-01-22 11:02:43 0 161
International
EAM Dr. S. Jaishankar Meet US DNI Tulsi Gabbard in Washington DC .....
EAM Dr. S. Jaishankar: Delighted to meet US DNI Tulsi Gabbard in Washington DC this...
By Bharat Aawaz 2025-07-03 07:32:43 0 2K
Andhra Pradesh
కులాలకు అతీతమైన నాయకత్వమే నిజమైన ప్రజాస్వామ్యం_వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ విభాగం గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు.
◆ కువైట్‌లో జరిగిన ప్రవాసాంధ్ర రెడ్డి సంఘ సమావేశానికి హాజరైన రాష్ట్ర ప్రధాన...
By John Baji 2026-01-03 05:41:58 0 162
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com