అస్తమించిన గిరిజన సూర్యుడు EX -CM శిబుసోరన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క

0
730

హైదరాబాద్/ హైదరాబాద్.

 

ఝార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్  మృతిపట్ల తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా, సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క  సంతాపం వ్యక్తం చేశారు. తదనంతరం మంత్రి సీతక్క  మాట్లాడుతూ... శిబూ సోరెన్  ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపకుడిగా.., ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేశారన్నారు. ముఖ్యంగా ఆయన గిరిజన సంఘాల హక్కుల కోసం, ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా ప్రసిద్ధి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదివాసీ హక్కుల కోసం ఆయ‌న సాగించిన పోరాటం భారతదేశ సామాజిక రాజకీయ చరిత్రలో చిర స్థాయిలో నిలిచిపోతుందన్నారు. ఆదివాసీ హక్కుల కోసం నిరంతరంగా పోరాడిన ఆయన జీవితమే ఒక సందేశమని కొనియాడారు. దేశానికి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి గురూజీ మృతి తీరని లోటుగా పేర్కొన్నారు. శిబు సోరెన్ చూపిన మార్గం ఈనాటి తరాలకు మార్గదర్శిగా నిలుస్తుందన్నారు.ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు మంత్రి సీతక్క తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

-సిద్దుమారోజు 

Like
1
Search
Categories
Read More
Telangana
SBI అకౌంట్ వాడుతున్నారా.. కాసేపట్లో..
ఖాతాదారులకు SBI బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు UPI,...
By Veeresh Kumar 2026-04-01 05:01:55 0 117
Andhra Pradesh
స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు
*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2025-12-20 12:06:11 0 132
Andhra Pradesh
వైసిపి ప్రభుత్వం నిలిపివేసిన బ్రాహ్మణ పథకాలన్నీ పునరుద్ధ రిస్తాం
*కృష్ణాజిల్లా, మచిలీపట్నం :*   గత వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసిన బ్రాహ్మణ సంక్షేమ...
By Rajini Kumari 2025-12-22 08:01:06 0 175
Andhra Pradesh
జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలి జిల్లా కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టులు
బాపట్ల: జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే...
By Gadiyapudi Narendra 2026-02-05 15:57:30 0 115
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com