నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.

0
492

హైదరాబాద్:   23. ఆగష్టు...టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదిన సందర్భంగా జోహార్లు సమర్పిస్తూ...

"నాన్నగారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా..?" తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన ! 

ఈ మాటలు అన్నది సాదా సీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశర్యం ఉండేది కాదేమో ! 

కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి.  టంగుటూరి ప్రకాశం రెండో కుమారుడు హనుమంతరావు ! 

అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు ని !

సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటినుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తరువాత ఎవరికైనా కంట తడి రాక మానదు ! 

ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి ఈ ఐదు రూపాయలు ! 

చెన్నై లో క్షణం తీరికలేని పనులు ముగించుకుని నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం  కొద్దిగా అస్వస్థత గా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తుర్లపాటి కుటుంబరావు వారి నివాసానికి చేరుకున్నారు ! 

లోపలి నుంచి బయటకు వచ్చిన టంగుటూరి కుమారుడు, తుర్లపాటి కుటుంబరావు  దగ్గరకు వచ్చి గద్గద స్వరంతో " నాన్న గారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు సర్దుతారా.." అనంటంతో షాక్ తో తుర్లపాటి కుటుంబరావు  నోటెంబట క్షణ కాలం మాట రాలేదు ! 

వెంటనే తేరుకుని ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్భం మీద ఆపుకుంటూ జేబులోనుంచి ఐదు రూపాయిలు తీసి ఆయన చేతిలో పెట్టాడు ! 

ఈ చేదు నిజాల్ని తుర్లపాటి కుటుంబరావు  స్వయంగా తన పుస్తకంలో కళ్ళకు కట్టినట్టు వివరించారు !!

దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి చివరి రోజుల్లో కటిక దారిద్రాన్ని అనుభవించిన టంగుటూరి లాంటి మహోన్నత వ్యక్తులను నేటి భారతంలో ఆశించగలమా ? 

ముఖ్యమంత్రి పదవి అంటే తర తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని తమ వారసులకు పంచి పెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకుని రూపాయికి లేని అటువంటి ముఖ్యమంత్రిని చూడగలమా ? 

అంటే చూడలేమనే సమాధానం వస్తుంది ! 

ఆ తరం వేరు 

నేటి తరం వేరు !

ఆనాటి రాజకీయాలు వేరు 

ఈనాటి అరాచకీయాలు వేరు !

డియర్ రాజకీయ నాయకులూ / పాలకులూ మీ మీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎలా ఉన్నా సంవత్సరంలో ఒకసారైనా ఇటువంటి మహానీయుడి పేరున మంచి కార్యక్రమాలు చేపట్టండి !

దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టే టంగుటూరి నేటికీ ప్రజల గుండెల్లో చిరస్మరనీయుడు అయ్యారు !

ఈ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా మహానుభావుడికి నివాళులు !

  - sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ ఏర్పాటుకు పరిశీలన
కర్నూలు  : కర్నూలు జిల్లా  కర్నూలు జిల్లా.   రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు...
By Hari Krishna 2026-02-03 12:31:43 0 89
Telangana
Citizen Rights & Corporate Accountability
In Wake of Sigachi Blast: Citizen Rights, Safety & Corporate Duty The devastating reactor...
By Citizen Rights Council 2025-07-01 05:55:28 0 2K
Andhra Pradesh
పుంగనూరు: రహదారుల భవనాల శాఖ ప్రజాసంఘాల ధర్నా.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని రహదారుల భవనాల శాఖ కార్యాలయం వద్ద గురువారం ప్రజా సంఘాల...
By Kothuru Murali 2026-01-22 13:20:35 0 81
Telangana
స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి : పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  రాజీవ్ గాంధీ 81 వ జయంతి సందర్భంగా  రాజీవ్ గాంధీ సర్కిల్...
By Sidhu Maroju 2025-08-20 13:53:09 0 471
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com