నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.

0
493

హైదరాబాద్:   23. ఆగష్టు...టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదిన సందర్భంగా జోహార్లు సమర్పిస్తూ...

"నాన్నగారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా..?" తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన ! 

ఈ మాటలు అన్నది సాదా సీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశర్యం ఉండేది కాదేమో ! 

కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి.  టంగుటూరి ప్రకాశం రెండో కుమారుడు హనుమంతరావు ! 

అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు ని !

సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటినుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తరువాత ఎవరికైనా కంట తడి రాక మానదు ! 

ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి ఈ ఐదు రూపాయలు ! 

చెన్నై లో క్షణం తీరికలేని పనులు ముగించుకుని నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం  కొద్దిగా అస్వస్థత గా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తుర్లపాటి కుటుంబరావు వారి నివాసానికి చేరుకున్నారు ! 

లోపలి నుంచి బయటకు వచ్చిన టంగుటూరి కుమారుడు, తుర్లపాటి కుటుంబరావు  దగ్గరకు వచ్చి గద్గద స్వరంతో " నాన్న గారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు సర్దుతారా.." అనంటంతో షాక్ తో తుర్లపాటి కుటుంబరావు  నోటెంబట క్షణ కాలం మాట రాలేదు ! 

వెంటనే తేరుకుని ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్భం మీద ఆపుకుంటూ జేబులోనుంచి ఐదు రూపాయిలు తీసి ఆయన చేతిలో పెట్టాడు ! 

ఈ చేదు నిజాల్ని తుర్లపాటి కుటుంబరావు  స్వయంగా తన పుస్తకంలో కళ్ళకు కట్టినట్టు వివరించారు !!

దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి చివరి రోజుల్లో కటిక దారిద్రాన్ని అనుభవించిన టంగుటూరి లాంటి మహోన్నత వ్యక్తులను నేటి భారతంలో ఆశించగలమా ? 

ముఖ్యమంత్రి పదవి అంటే తర తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని తమ వారసులకు పంచి పెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకుని రూపాయికి లేని అటువంటి ముఖ్యమంత్రిని చూడగలమా ? 

అంటే చూడలేమనే సమాధానం వస్తుంది ! 

ఆ తరం వేరు 

నేటి తరం వేరు !

ఆనాటి రాజకీయాలు వేరు 

ఈనాటి అరాచకీయాలు వేరు !

డియర్ రాజకీయ నాయకులూ / పాలకులూ మీ మీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎలా ఉన్నా సంవత్సరంలో ఒకసారైనా ఇటువంటి మహానీయుడి పేరున మంచి కార్యక్రమాలు చేపట్టండి !

దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టే టంగుటూరి నేటికీ ప్రజల గుండెల్లో చిరస్మరనీయుడు అయ్యారు !

ఈ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా మహానుభావుడికి నివాళులు !

  - sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
15 న ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు !! ఈనెల డిసెంబర్ 15వ తేదీ సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యలు పిర్యాదుల...
By Hari Krishna 2025-12-12 10:13:27 2 1K
Telangana
కుషాయిగూడ, అల్వాల్ పి.హెచ్. సి.లకు క్యాన్సర్ పరీక్ష పరికరాలు మహతి ఫౌండేషన్ సహకారంతో అందించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.
  అల్వాల్ ల్లో జరిగిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-06-03 14:06:11 0 1K
Andhra Pradesh
కూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండ ప్రధానం
కూతురు ప్రేమ వివాహానికి తండ్రి పిండప్రదానం!   మధ్యప్రదేశ్‌లోని విదిశాలో ప్రేమ వివాహం...
By Rajini Kumari 2025-12-22 07:55:49 0 117
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది.
పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి...
By Kothuru Murali 2026-01-11 05:41:03 0 60
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com