జగన్నాథగట్టు జర్నలిస్టుల స్థలాల అభివృద్ధికి కృషి చేయండి*

0
519

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వండి

- జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ను కోరిన ఏపీయూడబ్ల్యూజే నేతలు

- సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన కలెక్టర్

*కర్నూలు, ఆగస్టు 18:*

జగన్నాథగట్టు జర్నలిస్టుల స్థలాల అభివృద్ధికి కృషి చేయాలని ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరంట్ల కొండప్ప, ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కే నాగరాజు, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎన్ వెంకట సుబ్బయ్య, జిల్లా గౌరవ సలహాదారులు వైవీ క్రిష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఈ.ఎన్.రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు దస్తగిరి, జిల్లా సహాయ కార్యదర్శి శివరాజ్ కుమార్ జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ను కోరారు. సోమవారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2009 లో జగన్నాథ గట్టుపైన జర్నలిస్టులకు ఎకరా రూ.4 లక్షల 15.44 ఎకరాలు మార్కెట్ విలువ ప్రకారం కర్నూలు జిల్లా జర్నలిస్ట్స్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ కి ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో సొసైటీ నిర్వాహకులు 258 మంది జర్నలిస్టులకు 3.50 సెంట్ల ప్రకారం ప్లాట్లు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే జర్నలిస్టుల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఏర్పాటు చేసుకోవడానికి లింక్ రోడ్లు, కాలువలు, మంచినీటి వసతి, విద్యుత్ సౌకర్యం లేదన్నారు. దీంతో ఇన్నేళ్లు గడిచినా ఇళ్ళు నిర్మించలేని పరిస్థితి ఉందన్నారు. ఇళ్ళు నిర్మించలేదని గతంలోనున్న కలెక్టర్ జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం, కలెక్టర్ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లడం, కోర్టు ఆదేశాలను కొట్టివేయడం జరిగిందన్నారు. అయినా ఆన్లైన్ లో జర్నలిస్టుల ఇంటి స్థలాలను మార్చి ప్రభుత్వ భూమిగా చేర్చడం జరిగిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించి జగన్నాథగట్టు జర్నలిస్టు స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అలాగే చాలా మంది కొత్తగా వచ్చిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేవని, అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన అన్ని పరిశీలించి తప్పకుండా జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెప్పారు. కలెక్టర్ ను కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు సుధాకర్, రఫీ, అంజి పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
*_ఒకే కుటుంబానికి చెందిన 9మంది దుర్మరణం_* *_మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో ఝబువా జిల్లాలో బుధవారం...
By Vadla Egonda 2025-06-04 06:03:15 0 2K
Andhra Pradesh
అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసిన శ్రీ నెట్టెం రఘురాం
ప్రెస్ నోట్ 04.02.2026   అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ...
By Rajini Kumari 2026-02-05 07:31:09 0 41
Andhra Pradesh
విజయవాడ కుమ్మరిపాలెం ఈద్గా షాది ఖానా బరియల్ గ్రౌండ్ సందర్శన
*ప్ర‌చుర‌ణార్థం* *16-01-2026*     రాజకీయాలకు అతీతంగా ఈద్గా, షాదీ ఖానా,...
By Rajini Kumari 2026-01-16 12:47:00 0 80
Telangana
40 లక్షల రూపాయలతో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులు మొదలు : కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*దాదాపు 40 లక్షల రూపాయలతో స్ట్రాం వాటర్ డ్రైన్ పనులు చెప్పట్టిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్* ఈ...
By Vadla Egonda 2025-06-11 15:58:19 0 2K
Andhra Pradesh
జనవరి 01, 2026 తెలుగు పంచాంగం.
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 01 - 01 - 2026, వారం ... బృహస్పతివాసరే ( గురువారం...
By John Baji 2026-01-01 02:31:47 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com