చీరాల పరిసర ప్రాంతాల పెట్రోల్ బంకుల్లో నిబంధనల ఉల్లంఘన … ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న సెల్‌ఫోన్ వినియోగం

0
180

చీరాల: చీరాల పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది, నిర్వాహకులు ప్రమాదకరంగా సెల్‌ఫోన్లను వినియోగిస్తున్నట్లు నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు పెట్రోల్ కొట్టించే సమయంలో సెల్‌ఫోన్లు ఉపయోగించరాదని హెచ్చరికలు చేయాల్సిన సిబ్బందే స్వయంగా ఫోన్లు వాడుతూ విధులు నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
పెట్రోల్ బంకులోకి ప్రవేశించే సమయంలో ద్విచక్ర వాహనదారులు కూడా ఫోన్లు ఆపకుండానే ఇంధనం కొట్టించుకుంటుండటం సాధారణంగా మారింది. ఈ విషయాన్ని ప్రశ్నించినప్పుడు, కొందరు సిబ్బంది “ఫోన్ పే ద్వారా వచ్చిన చెల్లింపులు సరిగా వచ్చాయా లేదా అని చూసేందుకు ఫోన్ ఉపయోగిస్తున్నాం” అంటూ సమాధానం చెబుతున్నారని స్థానికులు తెలిపారు. అయితే ఇప్పటికే పెట్రోల్ బంకుల్లో స్కానర్లు, ఏటీఎం కార్డ్ మిషన్లు, డిస్ప్లే యంత్రాలు ఉన్నప్పటికీ ఫోన్ల వినియోగం కొనసాగడం నిబంధనల ఉల్లంఘనగా పేర్కొంటున్నారు.
కొంతమంది సిబ్బంది పెట్రోల్ కొడుతూనే ఫోన్‌లో మాట్లాడటం, కస్టమర్లతో ఫోన్ చేతిలో పెట్టుకుని సంభాషణలు సాగించడం వంటి ఘటనలు రోజూ కనిపిస్తున్నాయని ప్రజలు అంటున్నారు. ఇప్పటివరకు చీరాల పరిసర ప్రాంతాల్లో పెద్ద ప్రమాదాలు జరగకపోవడంతో ప్రమాద తీవ్రతపై అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మన ప్రాంతాల్లో ఘటనలు జరగకపోయినా, చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో జరిగిన అగ్ని ప్రమాదాలు, భారీ నష్టాలు ప్రజలకు తెలుసని వారు గుర్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇబ్బంది పడే కన్నా, ముందస్తు జాగ్రత్తలుగా సెల్‌ఫోన్ వినియోగాన్ని పూర్తిగా కట్టడి చేయాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, పెట్రోల్ బంకుల్లో నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు సిబ్బంది, వాహనదారులపై అవగాహన కల్పించకపోతే భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని నగర ప్రజలు హెచ్చరిస్తున్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
తాళం వేసి మూసివున్న ఇళ్ల భద్రత కోసం పోలీస్ వారు ఉచితంగా అందించే సీసీ కెమెరాల(LHMS) సేవను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.- గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు.
📍తాళం వేసి మూసివున్న ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చి, యజమానులు తిరిగి వచ్చే వరకు పటిష్ట పర్యవేక్షణ...
By John Baji 2026-01-12 14:29:54 0 211
Telangana
ప్రజా సమస్యలపై మాజీ కార్పొరేటర్ దూకుడు.. కమిషనర్‌కు వినతిపత్రం.|
మల్కాజ్‌గిరి:  మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  మల్కాజ్‌గిరి కమిషనర్...
By Sidhu Maroju 2026-04-09 09:51:10 0 550
Andhra Pradesh
స్వయంగా రక్తదానం చేసి సేవాస్పూర్తికి నిదర్శంగా నిలిచిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
గాలివీడు మండలం గాలివీడు టౌన్ లోని బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో సేవ భావం స్వచ్ఛంద సేవా సంస్థ...
By Benguluri Madhubabu 2026-06-13 08:21:43 0 138
Andhra Pradesh
ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ప్రకాశం జిల్లాలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన మండల వెంకట్రావు మెమోరియల్ ఆధ్వర్యంలో...
By Benguluri Madhubabu 2026-04-24 07:55:59 0 239
Andhra Pradesh
Chandrababu Naidu: తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
తిరుమల శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతను మరింత పెంచే దిశగా కీలక అడుగు...
By Pagadala Venkateswar 2026-03-21 11:30:13 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com