గూడూరు నగర పంచాయతీ నందు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్ జే వెంకటేశ్వర్లు కమిషనర్ రమేష్ బాబు

0
446

నగర పంచాయతీ నందు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్ జే వెంకటేశ్వర్లు కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ 

ప్రతి ఏడాది ఆగస్టు 15 స్వతంత్ర వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79 వ సంవత్సరానికి అరుగుపెడుతున్నందుకు మనందరికీ ఎంతో గర్వకారణమైన రోజు. ఎందుకంటే ఆరోజే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, ఎన్నో త్యాగాలు, బలిదానాలు చేసి భారత దేశానికి విముక్తి పొందిన రోజు. 1947 ఆగస్టు 15న మన దేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛను పొందింది. మనకు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన స్వేచ్ఛ కోసం ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకునే పవిత్ర సందర్భం.హింసతో స్వాతంత్య్రం సాధ్యం కాదు అని మహాత్మా గాంధీ అహింస మార్గంలో ఉద్యమం ప్రారంభించారు, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తువుల బహిష్కరణ, సహాయ నిరాకరణ కార్యక్రమాల ద్వారా బ్రిటీషు వారిని ఎదురించారు. సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లబాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, జవహర్ లాల్ నెహ్రు ఇలా ఎంతోమంది పోరాట ఫలితమే మన స్వాతంత్య్రం. మనం గుర్తించని స్వాతంత్ర సమరయోధులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. మన కోసం మన స్వేచ్ఛ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడిన వారిని ఈ ఒక్క రోజు గుర్తు చేసుకోవడం కాదు, వారి పోరాట స్పూర్తితో మన దేశాన్ని (ఇండిపెండెన్స్ డే అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందాం. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మునిసిపల్ సిబ్బంది శానిటరీ సిబ్బంది. మెప్మా సిబ్బంది ప్రజలు భారీగా పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం శాంతియుత దీక్షలు - సంఘీభావం తెలిపిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత దీక్షలు అల్వాల్ జెఎసి ప్రాంగణంలో...
By Sidhu Maroju 2025-06-30 14:33:19 0 882
Telangana
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్
  అమరావతి మహిళలను కించపరిచిన కేసులో అరెస్ట్ చేసిన ఏపీ తుళ్లూరు పోలీసులు హైదరాబాద్‌లో...
By Sidhu Maroju 2025-06-09 10:26:55 0 1K
Telangana
బస్తీ వాసులకు అండగా రెడ్డి శెట్టి
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు అయినా పాపయ్య నగర్ తో...
By Vadla Egonda 2025-07-23 10:04:52 0 863
Telangana
ఆరోగ్య బాగుకై అర్హులైన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే  నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి పలువురు...
By Sidhu Maroju 2025-06-12 11:27:57 0 1K
Telangana
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జిల్లాలో ని తమ తమ మండల ప్రాంతాలలో ప్రభుత్వ స్థలాలలోని స్లమ్స్ ఏరియాలను...
By Vadla Egonda 2025-07-25 01:41:33 0 926
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com