జూబ్లీ బస్ స్టేషన్ ను మోడల్ బస్ స్టేషన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
521

సికింద్రాబాద్:  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బుధవారం జూబ్లీ బస్ స్టేషన్ డిపో, కంటోన్మెంట్ బస్ డిపో లలో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా డిపో అధికారులు, ట్రాఫిక్ పోలీసు అధికారులు ,పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా బస్ స్టేషన్ లోకి వచ్చే బస్సులు మెయిన్ గేటు లో ఆపి ప్రయాణికులను దించడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవుతుందని, కంటోన్మెంట్ బోర్డు వారి స్థలాన్ని కొంత ఇప్పిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అధికారులు చెప్పడంతో ఎమ్మెల్యే వెంటనే కంటోన్మెంట్ సీఈఓ గారితో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కంటోన్మెంట్ బోర్డు స్థలాన్ని అవసరమైతే ఆర్టీసీ వారికి నామ మాత్రపు ఫీజుతో లీజుకు ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించడంతో వారు కూడా ఈ సమస్య పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పానికి మహిళా శక్తి పధకం ద్వారా కంటోన్మెంట్ నియోజకవర్గం లోని మహిళలకు బస్సులను ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నామని, అదనపు బస్సులు అవసరమైతే నా దృష్టికి తీసుకువస్తే మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించి అందిస్తామని,ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా నా దృష్టికి తీసుకువస్తే రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో, ఉన్నతాధికారులతో మాట్లాడతానని తెలిపారు. జూబ్లీ బస్ స్టేషన్ ను మోడల్ బస్ స్టేషన్ గా తీర్చి దిద్దడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఎమ్మెల్యే వెంట కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

    --sidhumaroju 

Search
Categories
Read More
Tamilnadu
మదురైలో ఆర్థిక పునరుజ్జీవనం: స్టార్టప్‌లు, భారీ ఇండస్ట్రియల్ పార్క్‌తో వేగవంతమైన వృద్ధి
వేగవంతమైన వృద్ధి: ఒకప్పుడు తమిళనాడులోని ఇతర నగరాల కంటే వెనుకబడిన మదురై, ప్రస్తుతం ఆర్థికంగా వేగం...
By Triveni Yarragadda 2025-08-11 07:54:05 0 464
Andhra Pradesh
వినాయక చవితిని మూడు రోజులు జరుపుకోవాలని:- ఎస్.ఐ చిరంజీవి
జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో వినాయక చవితి పండుగను మూడు రోజులపాటు...
By mahaboob basha 2025-08-26 14:27:36 0 279
Bharat
Civil Services Exam Registrations Witness a Slight Decline in Hyderabad Prelims 2025 scheduled for Sunday
Civil Services Exam Registrations Witness a Slight Decline in HyderabadPrelims 2025 scheduled for...
By BMA ADMIN 2025-05-24 08:10:18 0 2K
Andhra Pradesh
జగన్ ఒత్తిడి ఫలితమే... తల్లికి వందనం అమలు వైసిపి నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్,
మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కూటమి సర్కారుపై ఒత్తిడి తేవడం...
By mahaboob basha 2025-06-14 14:43:16 0 1K
Bharat Aawaz
రాజకీయ వ్యభిచారం ⭐ Right To Recall
https://youtu.be/WgtnvQrJPPM
By Hazu MD. 2025-08-19 09:24:05 0 534
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com