ll తీర ప్రాంత భద్రతకు పటిష్ట చర్యలు . ll

0
1K

శ్రీకాకుళం, జూలై 31: జిల్లాలో తీరప్రాంతాలైన బారువ, కళింగపట్నం, బావనపాడు తదితర తీర ప్రాంతాల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు ఆదేశించారు. గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అధ్యక్షతన, జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి గారు, జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గారు లతో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రధానంగా మత్స్యకారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు తీసుకోవాలని, సముద్రంలో పని చేసే ప్రతి మత్స్యకారుడు భద్రతతో కూడిన లైఫ్ జాకెట్ విధిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని పలు అంశాలు పైన అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మెరైన్  ఎ.ఎస్పీ, ఇండియన్ నేవీ స్టాప్ ఆఫీసర్ ఆదిత్య పాండే, డిఆర్ఓ ఎం.వెంకటేశ్వర రావు, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష,  విపత్తుల నిర్వహణ శాఖ డిపిఎం రాము, మత్స్య శాఖ డిడి సత్యనారాయణ, పోలీస్, వివిధ శాఖల ఆధిపతులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Madhavireddy: సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారు: ఎమ్మెల్యే మాధవీరెడ్డి.
  Madhavireddy: సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారు:...
By Pagadala Venkateswar 2026-01-29 07:31:16 0 50
Bharat Aawaz
📜 Article 10 – Continuity of Citizenship
What is Article 10 About? Article 10 of the Indian Constitution ensures that once a person has...
By Bharat Aawaz 2025-06-27 07:27:28 0 1K
Andhra Pradesh
స్వచ్ఛ నగర సాధనకు ప్రజల సహకారం అవసరం : నగర కమిషనర్
కర్నూలు : స్వచ్ఛతలో నగరానికి అగ్రస్థానమే లక్ష్యం• స్వచ్ఛ నగర సాధనకు ప్రజల సహకారం అవసరం•...
By Hari Krishna 2026-01-02 15:33:43 0 115
Andhra Pradesh
ఉద్యమకారులపై కేసులు అప్రజాస్వామికం – సీపీఐ జిల్లా కార్యదర్శి
సీపీఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు సోమవారం మాట్లాడుతూ, ప్రజల పక్షాన ఉద్యమాలు చేపట్టే...
By Pagadala Venkateswar 2026-01-15 07:52:41 0 75
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com