ఫిష్ వెంకట్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

0
966

సికింద్రాబాద్/అడ్డగుట్ట

 

సినీ నటుడు ఫిష్ వెంకట్ మృతి చాలా బాధాకరమని మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఫిష్ వెంకట్ శనివారం మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ లు అడ్డగుట్ట లోని వారి నివాసానికి వెళ్లి వెంకట్ పార్ధీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వెంకట్ మంచి నటుడు అని, అనేక చిత్రాలలో తన నటనతో ప్రేక్షకుల అభిమానం పొందారని అన్నారు. సినీ ఇండస్ట్రీలో ని అందరికి నాలుకలా ఉండేవాడని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధించారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
అసంపూర్తిగానే పోలీస్ స్టేషన్ భవనం , నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు
చిలుకూరు మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ 2017 లో కొత్త పోలీస్ స్టేషన్ మంజూరై స్టేషన్  కొరకు...
By Nookapangu Manikanta 2026-04-25 12:02:25 0 109
Telangana
తవకాలలో బయట పడ్డ 2వ శతాబ్దపు వస్తువుల
నేలకొండపల్లి బౌద్ధస్థూపం వద్ద పురావస్తు శాఖ జరిపిన తవకాలలో 2వ శతాబ్దంనికి చెందిన పళ్ళు వస్తువుల...
By Krishna Balina 2026-01-18 04:45:43 0 444
Andhra Pradesh
గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
మంగళవారం రాత్రి పుంగనూరు మండలం మొరంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్...
By Kothuru Murali 2026-02-25 11:11:57 0 191
Andhra Pradesh
కానిస్టేబుల్ రంగారావుకు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు.
అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా...
By Pagadala Venkateswar 2026-05-16 05:05:53 0 55
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com