శ్రీ చైతన్య పాఠశాల సుచిత్ర బ్రాంచ్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం - గ్రీన్ ఇండియా మిషన్.

0
1K

 

కొంపల్లి జోన్ ,సుచిత్ర బ్రాంచ్ లో  స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో చెట్లను నాటి పచ్చదనం పట్ల అవగాహన కల్పించారు.విద్యార్థుల చేత ర్యాలీని నిర్వహించి మొక్కలు పెంచడం పట్ల అవగాహన కల్పించే విధంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏ.జీ.యం రమణారావు మాట్లాడుతూ ,మొక్కలను నాటి వాటిని సంరక్షించడమే మన భవిష్యత్తు తరం కోసం పెట్టె గొప్ప పెట్టుబడి అని అన్నారు. శ్రీ చైతన్య భావితరానికి స్ఫూర్తిగా మారుతుందని ఆయన ప్రశంసించారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని చెప్పారు.  ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొంపల్లి జోన్ ఏ.జీ.యం రమణారావు ,ఆర్.ఐ. చక్రి , కొంపల్లి జోన్ కోఆర్డినేటర్స్ రవి కుమార్ , బ్రాంచ్ ప్రిన్సిపల్ భావన ,అకడమిక్ డీన్ వెంకట్ , సి అండ్ ఐకాన్ ఇంచార్జ్ దుర్యోధనారావు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మనుషులను అతిగా నమ్మడమే పూరి గారి బలహీనత
సంగీత దర్శకుడు రఘు కుంచె మరియు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి మధ్య ఉన్న అనుబంధం, ఆయన వ్యక్తిత్వం...
By Ponnala Srinivasrao 2026-04-04 12:27:46 0 123
Telangana
నగరవాసుల ప్లేట్లలో 'విషం': భారీగా పట్టుబడ్డ కల్తీ పన్నీరు నిల్వలు.|
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో భారీ కల్తీ పన్నీరు గుట్టురట్టు: 3,000 కిలోలు సీజ్.. ఆరు షాపులపై...
By Sidhu Maroju 2026-03-18 16:47:49 0 144
Andhra Pradesh
టీటీడీ భక్తులకు శుభవార్త
Ttd Annadanam Twice Daily In All Temples: ఏపీ సీఎం ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాల్లో మార్చి నెలాఖరు...
By Pagadala Venkateswar 2026-01-21 09:35:08 0 96
Andhra Pradesh
జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలి జిల్లా కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టులు
బాపట్ల: జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే...
By Gadiyapudi Narendra 2026-02-05 15:57:30 0 114
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com